Moviesత్రివిక్రమ్ మోజుకి అల్లు అర్జున్ బలి.. బన్ని అభిమానులకు ఎక్కడో కాలిపోతున్నట్లుందే..!?

త్రివిక్రమ్ మోజుకి అల్లు అర్జున్ బలి.. బన్ని అభిమానులకు ఎక్కడో కాలిపోతున్నట్లుందే..!?

సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ కాంబో ఏదైనా ఉంది అంటే అది ..ఖచ్చితంగా అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కాంబినేషన్ అనే చెప్పాలి. వీళ్ళు కలిసి నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడమే కాకుండా ..సూపర్ డూపర్ కలెక్షన్స్ కూడా సాధించింది . అంతేకాదు వీళ్ళ కాంబో అంటేనే జనాల్లో విపరీతమైన క్రేజ్ కూడా ఏర్పడింది.

కాగా అలాంటి కాంబోనే మరోసారి రిపీట్ చేయబోతున్నారు అంటూ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ప్రెసెంట్ పుష్ప2ట్టు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన తర్వాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో చేయాలి అని ఫిక్స్ అయిపోయాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఇదే న్యూస్ ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.

పుష్ప సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఈ సినిమా షూట్ ప్రారంభం కాబోతుందట . ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాను తెరకెక్కిస్తున్నారు . అయితే అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని చూస్ చేసుకున్నారట త్రివిక్రమ్ . ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే మొదటి నుంచి త్రివిక్రమ్ ఎందుకు సంయుక్త మీనాన్ కి కనెక్ట్ అయ్యాడు అని జనాలు బుర్ర పీక్కుంటున్నారు .

ఇండస్ట్రీలో ఎంతోమంది పాన్ ఇండియా హీరోయిన్లు ఉన్నారు .. కానీ త్రివిక్రమ్ సంయుక్తా మీనన్ ని తప్పిస్తే వేరే బ్యూటీ జోలికి వెళ్ళట్లేదు.. ఎందుకు..? అంటూ మండిపడుతున్నారు . అంతేకాదు అల్లు అర్జున్ క్రేజ్ కి సంయుక్తమీనన్ ఏమాత్రం సూట్ అవ్వదని.. త్రివిక్రమ్ సంయుక్త పై ఉన్న మోజుతో బన్నీ బలి చేస్తున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news