Newsబాల‌య్య 109లో ఆ ఇద్ద‌రు హీరోయిన్లు ఫిక్సేనా... థ‌మ‌న్‌కు ఈ సారి...

బాల‌య్య 109లో ఆ ఇద్ద‌రు హీరోయిన్లు ఫిక్సేనా… థ‌మ‌న్‌కు ఈ సారి షాకే…!

నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆరు పదుల‌ వయసు దాటిన బాలయ్యలో ఏమాత్రం ఊపు తగ్గలేదు. కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేయడమే కాదు వరుసగా హిట్లు కొడుతూ వారికి గట్టి పోటీ ఇస్తున్నాడు. తాజాగా భగవంత్‌ కేసరి మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న బాలయ్య తన తర్వాత సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు..? ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు..? అనే వివరాలు బయటకు వచ్చాయి.

బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో బాలయ్య ప్రక్కన నటించే హీరోయిన్లు ఎవరు అనే అంశంపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్య స‌ర‌స‌న‌ ఇద్దరు ముద్దుగుమ్మల నటిస్తున్నట్టు తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్య, బ్రో సినిమాలలో ఐటెం సాంగ్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించనుందట. ఆమెతో పాటు కలర్ ఫోటో హీరోయిన్ చాందిని చౌదరి కూడా నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా విజయ్ కార్తీక్ కన్నా వ్యవహరించనున్నారు. ఆయన రజనీకాంత్ జైలర్ సినిమాకు డివోపిగా వ్యవహరించారు. ఇక బాలయ్యకు వరుసగా మ్యూజికల్ హిట్లుయిస్తున్న థ‌మన్‌ ప్లేస్ లో ఈసారి దేవి శ్రీ ప్రసాద్ ని తీసుకోవడం ఆసక్తిగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news