Movies"ఆ బలి పూజ చేస్తే తారకరత్న సేఫ్"..నందమూరి హీరోలకు జ్యోతిష్కురాలు సలహా..!!

“ఆ బలి పూజ చేస్తే తారకరత్న సేఫ్”..నందమూరి హీరోలకు జ్యోతిష్కురాలు సలహా..!!

నందమూరి తారక రామారావు గారి మనవడు తారకరత్న రీసెంట్గా అనారోగ్యానికి గురయ్యారు . నారా లోకేష్ చేపట్టిన యువగలం పేరిట పాదయాత్రలో తారకరత్న పాల్గొని నడుస్తుండగా అక్కడ జనాల తాకడికి తట్టుకోలేక స్పృహ తప్పి కోల్పోయాడు . ఇదే క్రమంలో గుండెపోటు రావడంతో హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు . పరిస్థితి మరింత చేజారి పోవడంతో ఆయనను వెంటనే బెంగళూరులోని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.

కాగా రెండు రోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి డాక్టర్స్ కేర్ తీసుకుంటే మరణం అంచుల దాకా వెళ్లి బయటపడ్డాడు . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ కూడా ఆయన కోలుకోవాలని మళ్లీ యధావిధిగా లైఫ్ లో కొనసాగించాలని కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి హీరోస్ అయినా కళ్యాణ్ రామ్, బాలకృష్ణ , ఎన్టీఆర్ నందమూరి తారకరత్నను దగ్గరుండి చూసుకున్నారు . కాగా ఆయన హెల్త్ కండిషన్ బాగున్న ఇంకా పూర్తిగా ఆరోగ్యవంతుడిగా అవ్వలేదు అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే మెరుగైన వైద్యం కోసం ఆయనను విదేశాలకు పంపాలని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా మీడియాతో ప్రముఖ జ్యోతిష్కురాలు మాట్లాడుతూ..సంచలన కామెంట్స్ చేసింది.

“తారకరత్న పై శని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది . తారకరత్న పై ఎంత శని ప్రభావం ఉన్న ఆయన మంచి కోరుకునే వ్యక్తుల వల్లే దేవుడు ఇలాంటి అద్భుతాలు చేసి ఆయనని ప్రాణాపాయం నుంచి తప్పించాడని చెప్పుకొచ్చింది . అంతే కాదు విదేశాలకు తీసుకెళ్లడం వల్ల మార్పులు జరుగుతాయని ..స్థాన బలం మారితే ఆయన మరింతగా త్వరగా కోలుకుంటాడని చెప్పుకొచ్చింది.. ఇలాంటి సమయంలోనే గురు దత్తాత్రేయని పూజిస్తే మృత్యువు నుంచి బయటపడతారని .. పితృ దోషాల వల్లే ఇలాంటి తరహా ఘటనలు జరుగుతూ ఉంటాయని ..ఇలాంటివి ఇకపై జరగకుండా ఉండాలి అంటే నారాయణ బలి పూజ చేయాలి “అంటూ అప్పుడు దోషాలు హరిస్తాయని చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్ధిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news