Moviesబిగ్ బ్రేకింగ్: సర్కారు వారి పాట సినిమా వాయిదా..?

బిగ్ బ్రేకింగ్: సర్కారు వారి పాట సినిమా వాయిదా..?

యస్.. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా వాయిదా పడిందా అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలు. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత మహేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న ఈ సినిమాని డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మనం మహేష్ ని సరికొత్త లుక్ లో చూడబోతున్నాం అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

 

నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగుంటే.. ఈ సినిమా ఇప్పటికే రిలీజై బాక్స్ వద్ద సరికొత్త రికార్డ్లను నెలకోల్పాల్సింది. కానీ, బ్యాడ్ టైం..కరోనా కారణంగా కొన్నిసార్లు, మహేష్ బాబు హెల్త్ కారణంగా కొన్నిసార్లు..కీర్తి సురేష్ కరోనా బారినప్పుడు కొన్ని రోజులు..ఇలా వరుసగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ..ఫైనల్ గా మే 12 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు మేకర్స్. మొన్న ఉగాది నాడు రిలీజ్ అయిన పోస్టర్ లోను అదే విషయం చెప్పుకొచ్చారు.

కానీ, తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ చేయలేకపోవచ్చు అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం లేకపోనూలేదు. నిజానికి మే12 న సినిమా రిలీజ్ చేయాలంటే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి. ప్రస్తుతం ఉన్న టఫ్ కాంపీటీషన్ కు ఆ మాత్రం జాగ్రత్తగా లేకపోతే కష్టం. కానీ, సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ఇంకా మిగేలే ఉంది..కీర్తి పై కొన్ని సీన్స్..కీర్తి మహేష్ తో ఒక్క పాట .. కొన్ని ఫైట్ ఫైనల్ టచ్చింగ్ సీన్స్ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

మహేష్ బాబు అయితే ఈ నెల మూడో వారంలో విదేశాలకు వెళ్లిపోనున్నాడు. మండే ఎండలు కారణంగా షూటింగ్ కు రాలేనని..ఫ్యాకప్ చెప్పేసి..ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి రెండు వారాల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం అసాధ్యం. అందుకే ..సినిమాని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారట సర్కారువారిపాట టీం. ఏది ఏమైనా మహేష్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా బ్యాడ్ న్యూసే..? ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news