Moviesగుండ‌మ్మ క‌థ కాకుండా నాగ్‌-బాల‌య్య కాంబినేష‌న్లో మిస్ అయిన సినిమా ఇదే...!

గుండ‌మ్మ క‌థ కాకుండా నాగ్‌-బాల‌య్య కాంబినేష‌న్లో మిస్ అయిన సినిమా ఇదే…!

టాలీవుడ్ లో దివంగత లెజెండరీ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెరకెక్కాయి, ఎన్టీఆర్ – ఏఎన్నార్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ వేరు. వీరిద్దరూ ఎలాంటి ఇగోల‌కు పోకుండా కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేశారు. అలాగే వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యువరత్న నందమూరి బాలకృష్ణ, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కూడా కలిసి ఒకే సినిమాలో నటిస్తే బాగుంటుందని నందమూరి, అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.

వీరిద్దరి కాంబినేషన్లో గతంలో తెర‌కెక్కాల్సిన‌ ఒక సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అప్పట్లో బాలకృష్ణ – నాగార్జున ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. ఇద్దరి ఇమేజ్‌లు వేరు.. ఇద్ద‌రి అభిమానులు వేరు.
ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి నటించేందుకు సరైన కథ లేకపోవడం కూడా వీరు మల్టీస్టారర్ సినిమా చేయకపోవడానికి మరో కారణం. వీరిద్దరూ కలిసి భవిష్యత్తులో కలిసి నటించే అవకాశం కూడా తక్కువే.

 

అయితే ఏఎన్నార్ అన్నా, ఆయన కుటుంబ సభ్యులు అన్నా బాల‌య్య‌కు ఎంతో గౌరవం. బాలయ్య ఏఎన్నార్‌ను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు. నాగార్జునకు నందమూరి కుటుంబం అంటే గౌరవమే. నాగార్జున – హరికృష్ణ కాంబినేషన్లో సీతారామరాజు సినిమా వచ్చింది. ఇక గ‌తంలో మలయాళంలో హిట్టయిన క్రిస్టియన్ బ్రదర్స్‌ రీమేక్ లో బాలయ్య – నాగార్జున‌ను కలిసి నటింపజేయాలని అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి.

ఈ సినిమాలో నటించేందుకు బాలకృష్ణ – నాగార్జున ఇద్దరు ఓకే చెప్పారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ సినిమాను ఎలాగైనా పట్టాలు ఎక్కించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. కాల‌క్ర‌మంలో బాలయ్య – నాగార్జున‌ మధ్య సఖ్యత వాతావరణం కూడా లేదన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news