Movies"వర్షం" తరువాత ప్రభాస్-గోపీచంద్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలిస్తే..ఫ్యూజులు...

“వర్షం” తరువాత ప్రభాస్-గోపీచంద్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలిస్తే..ఫ్యూజులు ఎగిరిపోతాయ్.. ఎవరు నో చెప్పారంటే..?

సినిమా ఇండస్ట్రీలో జాన్ జిగిడి.. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లు ప్రభాస్ – గోపిచంద్ . వీళ్ళ ఫ్రెండ్షిప్ ఈనాటిది కాదు .. ఎప్పటినుంచో వీళ్ళ ఫ్రెండ్షిప్ అందరికీ తెలిసిందే . వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా డిఫరెంట్ గా వెరైటీగా కూడా ఉంటుంది . చాలామంది వీళ్ళ ఫ్రెండ్షిప్ కి ఫిదా అయిపోతూ ఉంటారు . కాగా వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమా వర్షం. త్రిష హీరోయిన్ గా ప్రభాస్ హీరోగా గోపీచంద్ విలన్ గా నటించారు .

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎన్నిసార్లు చూసినా సరే ఈ సినిమా తనివి తీరదు . అంతలా ప్రభాస్ గోపీచంద్ ల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటుంది . అయితే ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబోలో చాలా సినిమాలు తెరకెక్కించడానికి మేకర్స్ ప్రయత్నించారు. కానీ అన్ని ఫ్లాప్ అయ్యాయి . అయితే వీళ్ళ కాంబోలో ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ మిస్సయిన సినిమా ఒకటి ఉంది. అది మరేంటో కాదు బాహుబలి.

ప్రభాస్ కెరియర్నే మలుపు తిప్పిన బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి పాత్రలో ముందుగా గోపీచంద్ ని అనుకున్నాడట రాజమౌళి . గోపీచంద్ కూడా ప్రభాస్ కోసం విలన్ గా చేయడానికి యాక్సెప్ట్ చేశారట . ఆ తర్వాత ఈ సినిమా చేయడానికి రిజెక్ట్ చేశాడట గోపీచంద్ . ప్రభాస్ కారణంగానే ఈ ఆఫర్ తనకి వచ్చింది అన్న పేరు తనకి రాకూడదు అని.. దానివల్ల మా ఫ్రెండ్ షిప్ చెడిపోకూడదు అన్న కారణంతోనే గోపీచంద్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడట . ఒకవేళ గోపీచంద్ ఆరోజు ఈ సినిమా చేస్తుంటే సినిమా ఇంకా సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది ..సినిమా చరిత్ర తిరగరాసుండేది అంటున్నారు అభిమానులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news