Moviesబాలయ్య-సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన క్రేజీ సూపర్ హిట్ మూవీ...

బాలయ్య-సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన క్రేజీ సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి మిస్ అయితే ఆ కాంబో ని సెట్ చేయడానికి కొన్ని ఏళ్లు పడుతుంది ..మరికొన్నిసార్లు దశాబ్దాలు కూడా పడుతుంది. అలా క్రేజీ కాంబోలో సెట్ చేయడానికి కొన్ని దశాబ్దాలు ట్రై చేసి విరమించుకున్న డైరెక్టర్లు ఉన్నారు . అయితే సినిమా ఇండస్ట్రీలో లేటెస్ట్ గా ఓ న్యూస్ వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య తో సినిమా చేయడానికి అందరూ రెడీగా ఉంటారు .

ఆయన సినిమాలో ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అంటూ కాచుకొని కూర్చున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే అలాంటి హీరో సినిమాలో అవకాశము వస్తే చేతులారా రిజెక్ట్ చేసుకుంది సాయి పల్లవి . లేడీ పవర్ స్టార్ అంటూ ఇండస్ట్రీలోకి వచ్చిన అది తక్కువ టైంలోనే హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సాయి పల్లవి ..బాలయ్యతో ఆఫర్ వస్తే సున్నితంగా తిరస్కరించిందట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది .

కాగ ఈ సినిమాలో బాలయ్య చెల్లెలుగా వరలక్ష్మి శరత్ కుమార్ అదరగొట్టేసింది. నిజానికి గోపీచంద్ మల్లి నేని ఈ పాత్ర కోసం ముందుగా సాయి పల్లవిని అప్రోచ్ అయ్యారట . అయితే పాత్ర బాగున్న కథ నచ్చిన సాయి పల్లవి చేయను అంటూ రిజెక్ట్ చేసిందట . రీజన్ కూడా చెప్పకుండా రిజెక్ట్ చేయడం గోపీచంద్ ని బాధపెట్టిందట . ఈ క్రమంలోనే ఈ పాత్రకు తర్వాత చాయ్స్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ను చూస్ చేసుకున్నారు. ఆమె ఓకే అనడంతో ఈ పాత్ర హైలెట్గా మారింది. ఏ మాటక ఆ మాట ఈ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ బాగా నటించింది . సాయి పల్లవి పాత్రకు అస్సలు సూట్ అయ్యేదే కాదు అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news