Movies"యస్..ఆ విషయం నిజమే".. అఫిషియల్ గా ప్రకటించిన రష్మిక మందన్నా..!!

“యస్..ఆ విషయం నిజమే”.. అఫిషియల్ గా ప్రకటించిన రష్మిక మందన్నా..!!

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టితో మొదలైన వివాదం తర్వాత రష్మిక ఆచితూచి అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. రష్మిక మేనేజర్ ఆమె దగ్గర 80 లక్షల రూపాయలు మోసం చేసి చెక్కేసాడని.. ఆ కారణంగానే రష్మిక అతగాడిని తీసేసి వేరే మేనేజర్ ని పెట్టుకుంది అంటూ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ కోడై కూసింది.

అయితే దీనిపై అఫీషియల్ గా స్పందించింది రష్మిక మందన. ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. మేనేజర్ అండ్ రష్మిక విడిగా పని చేయాలని నిర్ణయించుకోవడం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలియజేసింది . “ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పని చేసాం.. పరస్పర ఒప్పందంతోనే మేము ఇలా విడివిడిగా వర్క్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాం . అంతేకానీ మీరు అనుకున్నంత ఏమీ జరగలేదు” అంటూ రష్మిక పేర్కొంది.

దీంతో రష్మికను తన మేనేజర్ మోసం చేశాడు అన్న వార్తలకు చెక్ పడినా.. రష్మిక మేనేజర్ విడిపోయారు అన్న వార్తకు మాత్రం క్లారిటీ వచ్చేసింది. నిప్పు లేనిదే పోగ రాదు కదా.. వీళ్ల మధ్య గోడవ జరగనిదే ఇన్ని రోజులు కలిసి వర్క్ చేసిన వీళ్ళు సడెన్ గా ఎలా విడిపోతారు అంటూ ఫ్యాన్స్.. చెప్పుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news