Moviesబ్రేకింగ్‌: ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ నిర్మాత ఇంట్లో తీర‌ని విషాదం

బ్రేకింగ్‌: ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ నిర్మాత ఇంట్లో తీర‌ని విషాదం

టాలీవుడ్ లో వ‌రుస‌ విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నెలలో వ్య‌వ‌ధిలోనే సూపర్ స్టార్ కృష్ణ, ఆయన భార్య ఇందిరా దేవి ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు టాలీవుడ్ లో నిన్నటి తరం స్టార్ హీరో హరినాథ్ కుమార్తె, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన ఓ అగ్ర నిర్మాత భార్య గుండెపోటుతో మృతి చెందారు. ఆమె ఎవరో కాదు నిన్నటి తరం అందాల హీరో హరినాథ్ కుమార్తె పద్మజ రాజు. పద్మజ హరినాథ్ కుమార్తె కావటం విశేషం. ఆమె సోదరుడు శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే. ఇక పద్మజారాజు భర్త జివీజి రాజు.

పవన్ కళ్యాణ్తో గోకులంలో సీత – తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. అలాగే ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా గోదావరి సినిమా కూడా నిర్మించారు. ఈయన బ్యానర్లో తెరకెక్కిన తొలిప్రేమ సినిమా అప్పట్లో ఏడాది పాటు ఆడడంతో పాటు.. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతి చిత్రం అవార్డు గెలుచుకుంది. ఇక మృతి చెందిన పద్మజారాజు వయసు 54 సంవత్సరాలు. ఇటీవల ఆమె తన తండ్రి హరినాథ్ గురించి అందాల నటుడు పేరుతో ఒక పుస్తకం కూడా వెలుగులోకి తీసుకువచ్చారు.

ఈ పుస్తకాన్ని దివంగత నటులు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. ఇటీవల పద్మజ ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ త్వరలోనే తన ఇద్దరు కుమారులలో.. ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారని తెలిపారు. వ‌చ్చే ఏడాది తన కుమారుడిని నిర్మాతగా పరిచయం చేస్తున్నట్టు కూడా వెల్లడించారు. ఏదేమైనా భర్త జివిజి రాజు ఉండగానే.. పద్మ 54 సంవత్సరాలకే గుండెపోటుతో మృతి చెందటం బాధాకరం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news