Moviesకొంప ముంచిన టాలీవుడ్ డైరెక్టర్.. దిక్కు తోచని స్థితిలో పూజా హెగ్డే..భళే...

కొంప ముంచిన టాలీవుడ్ డైరెక్టర్.. దిక్కు తోచని స్థితిలో పూజా హెగ్డే..భళే ఇరిక్కించేసాడే..!!

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి వర్క్ చేయబోతున్న సినిమా జనగణమన . అయితే లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన అటకెక్కినట్లు తెలుస్తుంది . దీనిపై విజయ్ దేవరకొండ కూడా పరోక్షంగా సినిమా ఆగిపోయినట్లే అంటూ కామెంట్స్ చేసుకొచ్చాడు. రీసెంట్గా ఫిలింఫేర్ అవార్డ్స్ లో పాల్గొన్న ఆయన జనగణమన పై ప్రశ్నించగా.. ” మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాం.. ఎంజాయ్ చేద్దాం.. నో మోర్ కామెంట్స్” అంటూ తప్పించుకున్నాడు.

దీంతో ఒక్కసారిగా జనగణమన ప్రాజెక్టు ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు అయ్యాయి . అంతేకాదు పూరి జగన్నాథ్ కూడా కొత్త ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ సినిమాలో హీరోయిన్గా నటించడానికి ఒప్పుకుని కొన్ని సినిమాలను వదులుకున్న పూజా హెగ్డే కెరియర్ మాత్రం ఇబ్బందుల్లోకి వెళ్లిపోయింది.

జనగణమన తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిసి వదులుకున్న పూరి జగన్నాథ్ హ్యాపీనే.. ఈ సినిమా నుండి తప్పుకున్న విజయ్ దేవరకొండ హ్యాపీనే.. అయితే చేతిలో ఆఫర్స్ లేక పూజా హెగ్డే దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. నిజానికి జనగణమన కోసం పూరి జగన్నాథ్ పూజ హెగ్డేను అడిగిమరీ హీరోయిన్గా ఒప్పించుకున్నారట. వేరే సినిమాలు క్యాన్సిల్ చేయించి ఈ సినిమాకు సైన్ చేయించుకున్నాడట . మరి ఇప్పుడు ఏమో పూరి.. ఆమె కాల్ చేసినలిఫ్ట్ చేయట్లేదు అని తెలుస్తుంది. ఏది ఏమైనా పూజ హెగ్డే భళే ఇరుక్కునేసింది అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news