Moviesద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ప్రేమ పెళ్లిలో ఇంత ట్విస్టా... అమ్మాయిని చూడ‌కుండానే..!

ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ప్రేమ పెళ్లిలో ఇంత ట్విస్టా… అమ్మాయిని చూడ‌కుండానే..!

టాలీవుడ్‌లో ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లిది విజ‌య‌వంత‌మైన ప్ర‌స్థానం. టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజుకు ద‌గ్గ‌ర బంధువు అయిన వంశీ స్వ‌స్థ‌లం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని ఖ‌నాపూర్‌. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి దిల్ రాజు సినిమాల‌కు చాలా రోజుల పాటు అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు. ర‌వితేజ హీరోగా వ‌చ్చిన భ‌ద్ర సినిమాకు కూడా అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు. మున్నా సినిమాతో డైరెక్ట‌ర్‌గా మారి.. ఆ త‌ర్వాత బృందావ‌నం, ఊపిరి, మ‌హ‌ర్షి, ఎవ‌డు లాంటి హిట్ సినిమాలు తెర‌కెక్కించాడు. వంశీ తెర‌కెక్కించిన ఏ సినిమా కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా ప్లాప్ అవ్వ‌లేదు.. నిర్మాత‌ల‌కు బాగా డ‌బ్బులు తెచ్చిపెట్టాయి.

ఇక వంశీ పైడిప‌ల్లి ప్రేమ క‌థ చాలా విచిత్రంగా మొద‌లైంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆలీ షోలో వంశీయే స్వ‌యంగా చెప్పాడు. భ‌ద్ర షూటింగ్ జ‌రుగుతున్న టైంలో అసిస్టెంట్‌గా ఉన్న వంశీ బెంగ‌ళూరులో ఆ సినిమాకు ప‌ని చేస్తున్నాడ‌ట‌. ఆ టైంలో ఆ సినిమాకు డిజైన‌ర్‌గా ప‌నిచేస్తోన్న శ్వేత – వంశీ స్నేహితులుగా ఉండేవార‌ట‌. ఓ రోజు శ్వేత‌కు క్లోజ్ ఫ్రెండ్ అయిన మాలిని ( వంశీ భార్య‌) అక్క‌డ‌కు వ‌చ్చింద‌ట‌. ఆ రోజు మాలిని బ‌ర్త్ డే కావ‌డంతో అంద‌రూ ఆమెకు విషెస్ చెపుతున్నార‌ట‌.

 

వంశీ కూడా ఆమె ఫేస్ కూడా స‌రిగా చూడ‌కుండానే హాయ్ అంటూ విష్ చేశాడ‌ట‌. ఆ రోజు ఈవెనింగ్ భ‌ద్ర హీరో ర‌వితేజ‌, డైరెక్ట‌ర్ బోయ‌పాటి, దిల్ రాజు, శ్వేత ఓ డిన్న‌ర్‌కు వెళ్లార‌ట‌. అప్పుడు శ్వేత మాలినితో ఫోన్లో మాట్లాడుతుంద‌ట‌. అప్పుడు వంశీ కూడా మాట‌ల సంద‌ర్భంలో మాలిని ప్ర‌స్తావ‌న రావ‌డంతో శ్వేత ద‌గ్గ‌ర ఫోన్ తీసుకుని 15 నిమిషాల పాటు ఏం మాట్లాడుతున్నాడో తెలియ‌కుండానే మాట్లాడేశాడ‌ట‌. ఆ రోజు ఉద‌యం వ‌చ్చిన‌ప్పుడు ఆమె ఫేస్ కూడా స‌రిగా చూడ‌లేద‌ని.. కానీ ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె వాయిస్ త‌న‌కు ఎక్క‌డో కనెక్ట్ అయిపోయింద‌ని.. ఆ మాట తీరు, వాయిస్‌కే ప‌డిపోయాన‌ని చెప్పాడు.

అక్క‌డ నుంచి మాలిని ఫోన్ నెంబ‌ర్ తీసుకుని రెగ్యుల‌ర్‌గా మాట్లాడ‌డం మొద‌లు పెట్టేశాడ‌ట‌. అటు వైపు ఆ అమ్మాయికి ఎలా ఉందో కాని… వంశీ మాత్రం ఆ అమ్మాయిని చేసేసుకోవాల‌ని బ‌లంగా ఫిక్స్ అయిపోయాడ‌ట‌. అప్ప‌ట‌కి వంశీ .. మాలినిని ఒక్క‌సారి మాత్ర‌మే.. అది కూడా చూసీ చూడ‌న‌ట్టుగా చూశాడు అంతే..! ఓ రోజు హ‌స‌న్‌లో సాంగ్ షూట్ చేస్తున్నార‌ట‌. ఆ సాంగ్ అయిపోయిన వెంట‌నే హైద‌రాబాద్‌కు వెళ్లిపోవాలి.. అయితే వంశీ మ‌న‌సులో మాత్రం ఎలాగైనా బెంగ‌ళూరు వెళ్లి మాలినిని క‌లిసి తాను ప్ర‌పోజ్ చేసేయాల‌ని బ‌లంగా ఫిక్స్ అయిపోయాడు.

వెంట‌నే దిల్ రాజు ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. మొన్న శ్వేత ఫ్రెండ్ మాలిని వ‌చ్చింది క‌దా అంటే రాజు హ‌హ అవును అన్నార‌ట‌. ఆమెను ఇష్ట‌ప‌డుతున్నాన‌ని… బెంగ‌ళూరు వెళ్లి ప్ర‌పోజ్ చేస్తున్నాన‌ని చెప్ప‌డంతో రాజు షాక్ అయ్యార‌ట‌. అస‌లు ఎప్పుడు క‌లిశావ్‌… ఎప్పుడు మాట్లాడుకున్నారు.. ఎప్పుడు ప్రేమించావ్ అని ఆశ్చ‌ర్యంగా వంశీ వైపు చూశార‌ట‌. వెంట‌నే ఓ కారు తీసుకుని బెంగ‌ళూరు వెళ్లి తాను ప‌లానా ప్లేస్‌లో ఉన్నాను.. రావాల‌ని కండీష‌న్ పెట్టాడ‌ట‌.

అయితే తాము ముందుగా రాన‌ని చెప్పిన మాలిని.. ఆ త‌ర్వాత కొద్ది సేప‌టికి వంశీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింద‌ట‌. ఆ వెంట‌నే వంశీ మాలినికి ప్ర‌పోజ్ చేయ‌డం.. తిరిగి హైద‌రాబాద్‌కు వ‌చ్చాక ఆ ప్రేమ మ‌రింత ముదిరి.. మాలిని కూడా వంశీని ఇష్ట‌ప‌డ‌డంతో చివ‌ర‌కు అది పెళ్లివ‌ర‌కు వెళ్లింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news