Moviesభరణంగా సమంతకు ఒక్క రూపాయి కూడా దక్కదు..ఎందుకంటే..?

భరణంగా సమంతకు ఒక్క రూపాయి కూడా దక్కదు..ఎందుకంటే..?

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ అక్కినేని నాగచైతన్య – సమంత తమ నాలుగేళ్ల‌ వివాహ బంధానికి ముగింపు పలికారు. 2017, అక్టోబ‌ర్ 7న గోవాలో జ‌రిగిన వివాహంతో ఒక్క‌టి అయిన ఈ దంపతులు నిన్న త‌మ వైవాహిక బంధానికి ముగింపు ప‌లికారు. 2010లో గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఏమాయ చేశావే సినిమాలో వీరిద్ద‌రు క‌లిసి తొలిసారిగా జంట‌గా న‌టించిన విషయం తెలిసిందే.

గ‌త కొద్ది నెల‌లుగా స‌మంత బిహేవియ‌ర్‌తో విసిగి విసిగి పోయి ఉన్న నాగ‌చైత‌న్య ఆమెకు విడాకులు ఇచ్చేయాల‌ని నాలుగైదు నెల‌ల క్రిత‌మే ఫిక్స్ అయిపోయాడ‌ని తెలుస్తోంది. సమంత గత కొన్నిరోజుల క్రితమే సోషల్ మీడియా ఖాతా నుంచి అక్కినేని సమంత అనే పేరు నుంచి కేవలం ”స్ ” అనే అక్షరాన్ని మాత్రమే ఉంచారు. అసలు అనుమానం అప్పటి నుంచే అభిమానుల్లో మొదలయింది. ఎన్ని రూమర్స్ వస్తున్న ఈ జంటలో ఎవరు కూడా స్పందించలేదు. అయితే రీసెంట్ గా వీరిద్దరు..విడాకుల పై క్లారిటీ ఇచ్చారు.

అయితే తాజాగా సమంత నాగ చైతన్యలు గురించి ఓ ఇంపార్ టెంట్ న్యూస్ బయటకు వచ్చింది.ఈ జంట పెళ్లికి ముందే ఓ కీలక ఒప్పందం చేసుకున్నారట. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. చైతన్య సమంత సరదాగా మాట్లాడుకుంటూ ..ఒకవేళ పెళ్లి తరువాత భవిష్యత్ లో విడిపోవాల్సి వస్తే సమంత అక్కినేని ఫ్యామిలీ నుండి ఒక్క రూపాయి కూడా భరణాన్ని ఆశించనని ముందే చెప్పిందట. ఇక నాగ చైతన్య సైతం ఇందుకు ఒకే చెప్పాడట. అందుకే ఈ కారణం చేతే సమంత భరణాన్ని తిరస్కరించిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news