Newsకారులో ప్రియుడితో భార్య ఎంజాయ్‌.. భ‌ర్త వీడియో కాల్‌తో సీన్ రివ‌ర్స్‌..

కారులో ప్రియుడితో భార్య ఎంజాయ్‌.. భ‌ర్త వీడియో కాల్‌తో సీన్ రివ‌ర్స్‌..

తమిళనాడులోని పెరంబూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న సెల్వరాజ్, జ్యోతిచిత్ర (37) దంపతులు ఉంటున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు. భర్త సెల్వ‌రాజ్ కేర‌ళ‌లో ఉద్యోగం చేస్తూ సంపాద‌న అంతా భార్య‌కు పంపుతున్నాడు. ఈ క్ర‌మంలోనే వీరి ఇంటికి స‌మీపంలో ఉండే అరుణ్ ( 28) అనే యువ‌కుడితో జ్యోతి ఎఫైర్ పెట్టుకుంది. అరుణ్ సొంతంగా కారు ఉంది. ఒంట‌రిగా ఉన్న జ్యోతిని లైన్లో పెట్టాల‌ని ప్లాన్ వేసిన అరుణ్ జ్యోతిని ప‌డ‌గొట్టేశాడు.

 

భ‌ర్త లేక‌పోవ‌డంతో జ్యోతి ఆడిందే ఆట పాడిందే పాట‌గా మారింది. ప్రియుడు అరుణ్‌తో ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె పోలీసుల‌కు ఓ ఫిర్యాదు చేసింది. తాను ఇంటికి వెళుతుంటే ఐదుగురు వ్య‌క్తులు కిడ్నాప్ చేసి కారులోనే త‌న‌పై వారు అత్యాచారం చేశార‌ని ఫిర్యాదు చేసింది. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెపితే త‌న‌ను చంపేస్తామ‌ని బెదిరించార‌ని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఎంత విచారించినా చిన్న క్లూ కూడా దొర‌క‌లేదు.

 

చివ‌ర‌కు ఆమెపై అనుమానంతో గ‌ట్టిగా ట్రీట్‌మెంట్ ఇవ్వ‌గా ఆమె అరుణ్ పేరు చెప్పింది. అరుణ్‌ను విచారిస్తే అంతా ఆమె ఇష్టంతోనే జ‌రుగుతుంద‌ని షాక్ ఇచ్చాడు. అస‌లు విష‌యం ఏంటంటే జ్యోతి ప్రియుడు అరుణ్‌తో కారులోనే రాస‌లీలలు కొన‌సాగిస్తుండ‌గా భ‌ర్త వీడియో కాల్ చేశాడు. వీడియో కాల్ ఎత్తితే భార్య బండారం బ‌య‌ట ప‌డుతుంది.. ఫోన్ ఎత్త‌క‌పోతే భ‌ర్త‌కు అనుమానం వ‌స్తుంది. దీంతో ఆమె కిడ్నాప్‌, అత్యాచారం డ్రామా ఆడింది. చివ‌ర‌కు పోలీసులు ఆమెపై కేసు పెట్ట‌డంతో పాటు అరుణ్‌ను అరెస్టు చేశారు. ఈ విష‌యం తెలిసి ఆమె భ‌ర్త షాక్ అయ్యాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news