బాహుబలి ..తెలుగు జనాలు అంత ఈజీగా ఈ పేరుని మర్చిపోతారా..? చరిత్ర సృష్టించిన సినిమా . ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి – తమన్నా హీరోయిన్గా – రానా దగ్గుబాటి విలన్ గా కనిపించారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది . బాహుబలి ద బిగినింగ్.. బాహుబలి ద కంక్లూషన్ . ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించింది . ఈ సినిమా తెలుగు చలనచిత్ర రికార్డులను బద్దలు కొట్టింది .
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు గుర్తింపు దక్కించిన సినిమా బాహుబలి కావడం గమనార్హం. ఆ తర్వాత బాహుబలి పార్ట్ 3 రావాలి అంటూ ఎంతోమంది జనాలు రాజమౌళి కి పర్సనల్గా మెసెస్జస్ చేశారు .చాలా చాలా ఈవెంట్స్ లో ఈ విషయాలను ఓపెన్ గా చెప్పుకొచ్చారు . అయితే ఎక్కడా కూడా రాజమౌళి బాహుబలి 3 పై స్పందించలేదు . అయితే తాజాగా ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బాహుబలి త్రీ వచ్చేస్తుంది అంటూ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు.
బాహుబలి 3 ది క్రౌన్ అండ్ బ్లడ్ ..అనే ట్యాగ్ తో రీసెంట్గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు . త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం అంటూ అఫీషియల్ గా ప్రకటించారు. “మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు.. ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతోంది”. అని ఎక్స్లో రాసుకొచ్చారు. ఇది ఓ యానిమేటెడ్ సిరీస్ లాగా రాబోతుంది అంటూ చెప్పారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. బాహుబలి 1 బాహుబలి 2 ఏ రేంజ్ లో ఇండస్ట్రీని అల్లాడించేస్తాయో తెలిసిందే. ఇప్పుడు యానిమేటెడ్ సిరీస్ పేరు మీద బాహుబలి రాజమౌళిని ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి దీనిపై పూర్తి డీటెయిల్స్ రాజమౌళి ఎప్పుడు బయటపెడతాడో..??
When the people of Mahishmati chant his name, no force in the universe can stop him from returning.
— rajamouli ss (@ssrajamouli) April 30, 2024
Baahubali: Crown of Blood, an animated series trailer, arrives soon! pic.twitter.com/fDJ5FZy6ld