Newsబ్రేకింగ్‌: మ‌రో నేత‌కు ప‌ద‌వి ఇచ్చిన జ‌గ‌న్‌...

బ్రేకింగ్‌: మ‌రో నేత‌కు ప‌ద‌వి ఇచ్చిన జ‌గ‌న్‌…

ఏపీ కేబినెట్లో మ‌రో నేత‌కు జ‌గ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. రెండు రోజుల క్రిత‌మే సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు రామ‌చంద్ర‌మూర్తి ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. రామ‌చంద్ర‌మూర్తి ప‌ద‌వి నుంచి అలా త‌ప్పుకున్నారో లేదో జ‌గ‌న్ వెంట‌నే మ‌రో నేత‌కు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వి ఇచ్చేశారు. జ‌గ‌న్ ఈ ప‌ద‌విని కూడా త‌న సొంత జిల్లా క‌డ‌ప‌కే చెందిన అంబ‌టి కృష్ణారెడ్డికి కేటాయించారు. కృష్ణారెడ్డి ని ప్రభుత్వ వ్యవసాయ సలహా దారుగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇక కృష్ణారెడ్డికి కేబినెట్ ర్యాంక్ ఇస్తున్న‌ట్టు కూడా ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేర‌కు ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ స‌ల‌హాదారుల‌ను త‌ప్పించాల‌ని చూస్తోంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతుండ‌గానే.. జ‌గ‌న్ మ‌రో స‌ల‌హాదారుడిని నియ‌మించ‌డంతో ఈ ప్ర‌చారానికి బ్రేక్ ప‌డిన‌ట్ల‌య్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news