Moviesపెళ్లికి ముందు న‌మ్ర‌త కోసం మ‌హేష్ ఇన్ని ప‌నులు చేశాడా..!

పెళ్లికి ముందు న‌మ్ర‌త కోసం మ‌హేష్ ఇన్ని ప‌నులు చేశాడా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పటి మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ 2005లో సీక్రెట్ గా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమా షూటింగ్ సమయం నుంచే ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్ట‌ర్‌ అయింది.

అయితే ఆ సినిమా షూటింగ్ టైంలో ఆస్ట్రేలియాలో 40 రోజుల పాటు ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అప్పుడే మహేష్ – నమ్రత మధ్య ప్రేమ చిగురించిందని అంటారు. ఆ తర్వాత ఐదు సంవత్సరాలు పాటు మహేష్ తన ప్రేమను ఎంతో సీక్రెట్ గా మెయింటైన్ చేశారు. న‌మ్ర‌త‌ కోసం మ‌హేష్‌ ఎవరికీ తెలియకుండా ముంబై వెళ్లి వచ్చేవాడు.

అప్పట్లో ఇప్పుడంత‌ సోషల్ మీడియా ప్రభావం మీడియా ప్రభావం ఎక్కువగా లేదు. సెలబ్రిటీల విషయాలు పెద్దగా బయటకు వచ్చేవి కావు. అయితే రెండు, మూడు సినిమా మ్యాగ‌జైన్ల‌లో మాత్ర‌మే ఇలాంటి విష‌యాలు వచ్చేవి. సినిమా షూటింగ్ గ్యాప్ వ‌చ్చినా లేదా వీకెండ్లో ఫ్లైట్లో ముంబై వెళ్లి న‌మ‌త్ర‌ను కలుసుకుని వ‌చ్చేవాడ‌ని అప్పట్లో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అయితే దీనిపై ఎవరు నోరు మెదపలేదు.

చాలామంది మాత్రం నిజంగా నార్త్ ఇండియన్… పైగా సినిమా హీరోయిన్ అయిన‌ నమ్రత పెళ్లి చేసుకుంటాడ‌ని కూడా ఎవరూ అనుకోలేదు. అయితే సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోకపోవడంతో చివరకు కుటుంబ సభ్యుల సమక్షంలో న‌మ‌త్ర మెడ‌లో సీక్రెట్ గా మూడుముళ్లు వేశారు.

వీరి ప్రేమ గురించే ఈ సినిమా దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ అప్పట్లో సినిమా కోసం చాలా అందమైన లొకేషన్లలో షూటింగ్ చేశామని… అయితే వీరు ప్రేమలో ఉన్నట్లు తనకు తెలియదని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news