Moviesబ్రేకింగ్‌: టాప్ సింగ‌ర్ త‌న‌యుడు మృతి

బ్రేకింగ్‌: టాప్ సింగ‌ర్ త‌న‌యుడు మృతి

ప్ర‌ముఖ బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగ‌ర్ అనురాధా పాడ్వాల్ కుమారుడు ఆదిత్య కన్నుమూశాడు. ఆయన వయసు 35 సంవత్సరాలు. ఆదిత్య గత కొన్ని నెలలుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆదిత్య‌కు మూత్ర‌పిండాలు ప‌నిచేయ‌క‌పోవ‌డంతోనే మృతి చెందాడంటున్నారు. ఈ విష‌యాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఆదిత్య మృతి విషయాన్ని వెల్లడించారు.

త‌మ‌కు ఎంతో ప్రియ‌మైన ఆదిత్య పాడ్వాల్ ఇక లేడ‌న్న విష‌యం తాను న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  ఆదిత్య చాలామంచి మ్యుజీషియన్ అని, గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తాను ప్రోగ్రాం చేసిన ఓ పాటను రెండు రోజుల క్రితమే చాలా అందంగా పాడాడని గుర్తు చేసుకున్నారు. ‘లవ్ యు బ్రదర్.. మిస్‌ యూ బ్రదర్” అని శంకర్ మహదేవన్ పోస్టు చేశారు.

గత నాలుగు రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సంగీత కార్యక్రమాల నిర్వాహకుడు, నిర్మాతగా ఆదిత్య బాలీవుడ్‌కు సుపరిచితులు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటించిన ఠాక్రేకు ఆదిత్య పనిచేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news