Newsవరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి మహేశ్ బాబుకి మధ్య ఉన్న...

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి మహేశ్ బాబుకి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? భళే విచిత్రంగా ఉందే..!!

ప్రెసెంట్ కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఈగర్ గా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి కొద్ది గంటల్లోనే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది . ఇండియా వ్శ్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ చూడడానికి ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీస్ అహ్మదాబాద్ చేరుకున్నారు. ఈ మ్యాచ్ చూడాలని చూడడానికి నరేంద్ర మోడీ సైతం స్టేడియంకి రాబోతున్నట్లు తెలుస్తుంది

అంతేకాదు అమిత్ షా .. బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ కూడా ఈ మ్యాచ్ ని చూడడానికి అహ్మదాబాద్ వెళ్ళబోతున్నారట . కాగా ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి ఉన్న క్రేజీ లింక్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . 2011లో జరిగిన ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ కి మహేష్ బాబు హాజరయ్యారు అని .. అందుకే ఆ మ్యాచ్ గెలిచింది అంటూ ఓ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.

మహేష్ బాబుకి క్రికెట్ అంటే చాలా ఇష్టమైన ఆయన బిజీ షెడ్యూల్స్ కారణంగా క్రికెట్ మ్యాచ్ లైవ్ లో చూడడానికి వీలు కాదు. కొన్ని సందర్భాలలో సినిమా షూట్ ని క్యాన్సిల్ చేసుకుని మరి వెళ్తూ ఉంటారు . అలాంటి ఓ సందర్భమే 2011 ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ . సినిమా షూట్ లో బిజీగా ఉన్నా సరే ఈ మ్యాచ్ కోసం షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకుని మరి వెళ్ళాడు మహేష్ బాబు. అందుకే ఆ మ్యాచ్ విన్ అయ్యాము అంటూ మహేశ్ ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈసారి కూడా ఈ మ్యాచ్ కు మహేష్ బాబు వస్తే కచ్చితంగా ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇదే న్యూస్ ను ఫ్యాన్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news