News"నా కొడకల్లారా కొన్ని రోజులు ఆగండి .. ఒక్కొక్కడికి తడిసిపోద్ది".. వైరల్...

“నా కొడకల్లారా కొన్ని రోజులు ఆగండి .. ఒక్కొక్కడికి తడిసిపోద్ది”.. వైరల్ అవుతున్న గౌతం వాసు దేవ్ మీనన్ ట్వీట్..!!

చాలా టైం గ్యాప్ తీసుకొని స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కిస్తున్న సినిమా “ధ్రువ నక్షత్రం”. తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఏ ముహూర్తాన ఈ సినిమాను అనౌన్స్ చేశారో తెలియదు కానీ .. సినిమా స్టార్టింగ్ నుంచి ఈ ప్రాజెక్టుకు బ్రేకులు పడుతూనే వచ్చాయి . ఇన్నాళ్లు సినిమా గురించి వెయిట్ చేస్తే ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి దాపురించింది .

తాజాగా అన్ని అవాంతరాలు దాటుకుని నవంబర్ 24 ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అవ్వబోతుంది అనగా కొన్ని అనివార్య కారణాల చేత సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఈ క్రమంలోనే వాసుదేవ్ మీన ట్విట్టర్ ద్వారా స్పందించారు .

“క్షమించండి ధ్రువ నక్షత్రం సినిమాను ఈరోజు తెరపైకి తీసుకురాలేకపోతున్నాము.. చాలా ట్రై చేసాం ..కానీ ఒకటి రెండు రోజులు ఇంకా టైం పట్టేలా ఉంది అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్ల ప్రాపర్ స్క్రీన్ లతో అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తా.. సినిమాకు మీరు ఇస్తున్న మద్దతు నాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. కేవలం కొద్ది రోజులు ఓపిక పట్టండి.. వచ్చేస్తున్న “అంటూ ఇంట్రెస్టింగ్ ట్విట్ చేశారు . అయితే ఈ ట్వీట్ కి గౌతం వాసుదేవ్ మీనన్.. విక్రమ్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో స్పందిస్తున్నారు. ఎవరైతే ధ్రువ నక్షత్రం సినిమాని ట్రోల్ చేశారో..”నా కొడకల్లారా కొన్ని రోజులు ఆగండి ఒక్కొక్కడికి తాట తీసిపోయే రేంజ్ లో కలెక్షన్స్ ఉంటాయి “అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news