Newsముగ్గురు టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్ల‌కు పెళ్లిళ్లోచ్‌.. !

ముగ్గురు టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్ల‌కు పెళ్లిళ్లోచ్‌.. !

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ మధ్య పెళ్లి రూమర్స్ చాలా జోరుగా వినిపిస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా తమ మీద వస్తున్న పెళ్లి వార్తలపై ఎంతటి క్లారిటీ ఇచ్చిన కూడా ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఈ మధ్య ఇద్దరు స్టార్ హీరోయిన్ల పైన వివాహ వార్తలు రోజు రోజుకి ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాంటి వారిలో కీర్తి సురేష్, సాయి పల్లవి కూడా ఒకరు. అయితే ఇందులో కీర్తి సురేష్ పై వచ్చిన వార్తలన్నీ ఆ మధ్య కాలంలో ఏ హీరోయిన్ పైన ఇంతవరకు రాలేదని చెప్పవచ్చు.

బాయ్ ఫ్రెండ్ తో ప్రేమలో ఉందని మరొకసారి సంగీత దర్శకుడు తో ప్రేమలో ఉందనే వార్తలు తెగ వైరల్ గా మారాయి. కానీ ఈ వార్తలన్నీ కూడా రూమర్లే అన్నట్లుగా తమ తల్లిదండ్రులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హీరోయిన్ సాయి పల్లవి తమిళ డైరెక్టర్ ని వివాహం చేసుకుందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపించాయి. అయితే ఇందులో నిజం లేదని చాలా దారుణంగా ఎలా ఆలోచిస్తున్నారని సాయి పల్లవి పలువురు నెటిజెన్లకు దిమ్మతిరిగే సమాధానాన్ని ఇవ్వడం జరిగింది.

దీంతో పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో మరొక క్రేజీ హీరోయిన్ చేరిపోయింది. ఆమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరుపొందిన శ్రీలీల.. క్రేజీ ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీగా ఉన్న శ్రీ లీల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారుతోంది. అదేమిటంటే త్వరలోనే ఏమి వివాహం చేసుకోబోతుందని వార్తలు రావడంతో ఈ వార్తల పైన శ్రీ లీల టీం ఎలాంటి నిజం లేదంటే స్పష్టం చేసింది. కెరియర్ పరంగా బిజీగా చాలా బిజీగా ఉన్నానంటూ స్పష్టంగా తెలియజేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news