Newsఒకే ఒక్క సినిమాతో ఇండియాలోనే రిచ్చెస్ట్ అయిన హీరోయిన్‌... ఆమె కెరీర్...

ఒకే ఒక్క సినిమాతో ఇండియాలోనే రిచ్చెస్ట్ అయిన హీరోయిన్‌… ఆమె కెరీర్ ఓ సెన్షేష‌న్‌..!

సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు అడగుపెడుతూ ఉంటారు. కొంతమంది నాలుగైదు సినిమాలకే కనుమరుగైతే.. మరికొంతమంది మంది మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అవకాశం వచ్చిన ప్రతీ సినిమా చేసుకుంటూ ఇండస్ట్రీని వదిలిపెట్టకుండా కొనసాగుతూనే ఉంటారు. వయస్సు పెరిగిన తర్వాత హీరోయిన్ పాత్రలు తగ్గితే వేరే పాత్రలు కూడా చేయడానికి వెనుకాడరు.

ఇప్పటికే కొంతమంది సీనియర్ హీరోయిన్లు వివిధ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటారు. కొంతమంది హీరోయిన్లు పెళ్లి తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమై ఫ్యామిలీ బాధ్యతలకే పరిమితమవుతారు. అలాంటి వారిలో గాయత్రి జోషి ఒకరు. ఇటీవల ఇటలీలో గాయత్రి జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం వారిద్దరూ సురక్షితంగా ఉండగా.. రోడ్డు ప్రమాదం క్రమంలో గాయత్రి జోష్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్నాయి. ఆమె గురించి తెలసుకునేందుకు చాలాలమంది ఆసక్తి చూపిస్తున్నారు.

2004లో మోడల్ గా సక్సెస్ అయిన గాయత్రి జోషి.. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ తో కలిసి నటించిన అశుతోష్ గోవారికర్ అనే సినిమాతో స్టార్ డమ్ అందుకుంది. అయితే ఆ సినిమా తర్వాత ప్రమఖ వ్యాపారవేత్త ఒబెరాయ్ ను గాయత్రి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు ఆమె పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. కేవలం ఒకే ఒక్క సినిమా చేసిన గాయత్రి జోషి.. పెద్ద వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.

ఇండియాలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఒబెరాయ్ ఉన్నాడు. ఒబెరాయ్ కన్‌స్ట్రక్షన్ ప్రమోటర్లలో ఆయన ఒకరిగా ఉన్నారు. ఒక సినిమాతో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్.. ఇలా అత్యంత ధనవంతుడిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తోంది. ఏది ఏమైనా లక్ అంటే ఈ బ్యూటీదేనని నెటిజన్లు అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news