Newsస్వ‌యంవ‌రం ల‌య‌... ఆ హీరో మ‌ధ్య నిజంగానే ప్రేమాయ‌ణం న‌డిచిందా...!

స్వ‌యంవ‌రం ల‌య‌… ఆ హీరో మ‌ధ్య నిజంగానే ప్రేమాయ‌ణం న‌డిచిందా…!

టాలీవుడ్ లో స్వయంవరం సినిమాతో హీరో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు తొట్టెంపూడి వేణు, విజయవాడ అమ్మాయి లయ. కే విజయభాస్కర్ దర్శకత్వంలో తరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు యూత్‌ను పిచ్చిపిచ్చిగా ఆకట్టుకుంది. కీరవాణి రాగంలో అన్న పాట ఎంత పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు.

ఈ సినిమాతో వేణు, లయ హీరో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అప్పట్లో ఈ జంటకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక వేణు టాలీవుడ్ సీనియర్ దర్శకుడు బి.గోపాల్ కు స్వయానా మేనల్లుడు కావడం.. ఇటు లయ విజయవాడకు చెందిన తెలుగు అమ్మాయి కావడంతో వీరిద్దరికీ స్వయంవరం ఇచ్చిన విజయోత్సవం చాలా ఏళ్లపాటు వీరు టాలీవుడ్ లో కొనసాగేలా చేసింది. ఈ సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యాక కూడా చాలా ఏళ్ల‌పాటు వేణు, లయ క్లోజ్ గా ఉండేవారని.. దీంతో వీరిద్దరి స్నేహంపై రకరకాల పుకార్లు షికార్లు అయితే బయట వినిపించాయి. అయితే ఆ తర్వాత ఎవరి ? దారుల్లో వారు ప్రయాణించారు. వేణు టాలీవుడ్ లో మిడిల్ రేంజ్ హీరోగా ఎదిగితే.. లయ మరీ స్టార్ హీరోయిన్ కాకపోయినా స్టార్ హీరోలకు జోడిగా మాత్రం నటించింది.

ఆ తర్వాత ఓ ఎన్నారై డాక్టర్ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత లయ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి వ‌రుస‌ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news