Moviesస‌మంత ప‌క్క‌న కూర్చోవాలంటే టిక్కెట్ రేటు అన్ని ల‌క్ష‌లా… సామ్ క్రేజ్...

స‌మంత ప‌క్క‌న కూర్చోవాలంటే టిక్కెట్ రేటు అన్ని ల‌క్ష‌లా… సామ్ క్రేజ్ ఇది…!


ఆరోగ్యంగా ఉన్నారా ? అనారోగ్యంతో ఉన్నారా.. సినిమాలు చేస్తున్నారా ? ప్రస్తుతం ఫామ్ లో ఉన్నారా లేదా అన్న లెక్కలు సమంత విషయంలో ఎవరికీ అవసరం లేదు. సమంతను చూసామా.. లేదా సమంత పక్కన కూర్చున్నామా ? లేదా అన్నదే ముఖ్యం. సమంత నటిస్తేనే కాదు.. ఆమె పక్కన.. ఆమె దగ్గర్లో కూర్చున్న వారు భారీ పారితోషకం చెల్లించాల్సిందే.

ఏమిటి ఈ పారితోషం గొడవలు అనుకుంటున్నారా ? మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత వైద్యం కోసం ఇటివల అమెరికా వెళ్ళింది అంటూ ముందు ప్రచారం జరిగింది. అయితే ఆమె ఈ నెల 20న అక్కడ నిర్వహించిన ఇండియా డే పరేడ్ కార్యక్రమంలో పాల్గొంది. ఇందుకోసమే అమెరికా వెళ్ళింది. తాజాగా సమంత.. విజయ్ దేవరకొండ తో జతకట్టిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదలవుతుంది.

విజయ్ తో పాటు ఈ సినిమా యూనిట్ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటుంది. శుక్రవారం న్యూయార్క్ లో కుషి సినిమా ప్రచార కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఇందులో సమంత కూడా పాల్గొంది. కేవలం కొద్దిసేపు మాత్రమే పాల్గొన్న ఆమెకు నిర్వాహకులు అక్షరాలా రు. 30 లక్షలు చెల్లించినట్లు సమాచారం. మరో విశేషం ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం లేదు.

ఈవెంట్ నిర్వాహకులు టికెట్ ఫిక్స్ చేశారు. టికెట్ ధర రు. 12 వేల నుంచి రెండు లక్షల వరకు నిర్ణయించారు. రు. 2 లక్షల టికెట్ కొనుగోలు చేసిన వారికి సమంత కూర్చున్న వరుసలో కూర్చునే అవకాశం కల్పించారు. దీంతో కొద్ది నిమిషాల్లోనే టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. అందుకే సమంత క్రేజ్ మామూలుగా లేదని నెటిజన్లు ఒక్కటే చర్చించుకుంటున్నారు. ఇక సమంత అమెరికాలో తిరుగుతున్న ఫోటోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news