Moviesప్ర‌భాస్‌ను న‌మ్ముకుని దారుణంగా దెబ్బ‌తిన్న హీరోయిన్లు వీళ్లే...!

ప్ర‌భాస్‌ను న‌మ్ముకుని దారుణంగా దెబ్బ‌తిన్న హీరోయిన్లు వీళ్లే…!

మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరన నటించిన హీరోయిన్ టైం అస్సలు బావుండటం లేదు. బాహుబలి సినిమా సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పాన్ ఇండియన్ రేంజ్‌లో పెరిగిపోయింది. దాంతో ఆ క్రేజ్ కోసం ఎంతో మంది హీరోయిన్స్ ఆశపడ్డారు. అందుకే, ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కోసం వెంపర్లాడారు. ఒక్క అనుష్కకి తప్ప ఆ క్రేజ్ ఇంకో హీరోయిన్‌కి దక్కింది లేదు.

బాహుబలి రెండు భాగాలలో అనుష్క పర్ఫార్మెన్స్‌కి మన దేశం మాత్రమే కాకుండా ఇతర దేశాలలోనూ అభిమానులు తయారయ్యారు. హుందాతనం..నటన అందరికీ తెగ నచ్చేసింది. అరుంధతి తర్వాత అంతకి మించిన పర్ఫార్మెన్స్ అంటే బాహుబలి సిరీస్ అని చెప్పాలి. ఆ రకంగా ప్రభాస్ సరసన నటించిన అనుష్కకి మాత్రమే ఇప్పటి వరకు పాన్ ఇండియన్ హీరోయిన్‌గా పాపులారిటీ దక్కింది.

కానీ, ఆ తర్వాత మన ప్రభాస్ సరసన నటించిన ఏ హీరోయిన్‌కి కలిసి రాలేదు. సాహో సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి కారణం హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్. ఇందులోనే శ్రీలంకన్ భామ జాక్వెలెన్ ఫెర్నాండస్ కూడా ఓ హాట్ సాంగ్‌లో నర్తించింది. కానీ, ఇద్దరికీ ఒరిగిందేమీ లేదు. ఆ తర్వాత పూజా హెగ్డే.

ఈ బ్యూటికీ ప్రభాస్ వల్ల కలిసి వచ్చిందేమీ లేదు. పూజా ఖాతాలో ఓ భారీ డిజాస్టర్ నిలవడం తప్ప. అంతేకాదు, ప్రభాస్ – పూజాల మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయట. ఇప్పుడు నటిస్తున్న శృతి హాసన్ పరిస్థేమిటో చూడాలి. మిర్చీ లాంటి బ్లాక్ బస్టర్‌లో హాట్ సాంగ్ చేసిన హంసా నందిని మళ్ళీ అంతగా ఎక్కడా కనిపించింది లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news