Moviesఆమెతోనే ఆచార్య సినిమా చూడాలి అనుకుంటున్నా..మనసులోని మాట చెప్పేసిన చరణ్..!!

ఆమెతోనే ఆచార్య సినిమా చూడాలి అనుకుంటున్నా..మనసులోని మాట చెప్పేసిన చరణ్..!!

మెగా అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా “ఆచార్య”. కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తుండటం ఓ స్పెషల్ అయితే.. అభిమానుల కోరిక మేరకు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఈ సినిమా లో నటించడం మరో బిగ్గెస్ట్ ఐ ఫీస్ట్. మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ఆచార్య సినిమా మరి కొద్ది రోజుల్లో థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. సుమారు మూడేళ్ల నుంచి స‌స్పెన్స్‌తో ఊరిస్తూ వ‌స్తోన్న ఆచార్య ఎట్ట‌కేల‌కు ఈ నెల 29న థియేట‌ర్ల‌లోకి రాబోతోంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రు. 151 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అంటే ఓవ‌రాల్‌గా రు. 450 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు ఈ సినిమాకు రావాల్సి ఉంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి.కొర‌టాల శివ డైరెక్ష‌న్‌, ఇటు కాజ‌ల్‌, పూజా హెగ్డే, సోనూ సుద్ లాంటి భారీ కాస్టింగ్ ఉండ‌డంతో పాటు టీజ‌ర్లు, ట్రైల‌ర్లు, స్టిల్స్ ఈ సినిమాపై అంచ‌నాలు ఎక్క‌డికో తీసుకుపోయాయి.ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకున్న చిత్ర బృందం చిత్ర ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది. రీసెంట్ గా చరణ్, కొరటాల, చిరు ఓ ఇంటర్వ్యుల్లో పాల్గొన్నారు.

ఇక ఆ ఇంటర్వ్యుల్లో చరణ్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన బోలెడు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఈ సినిమా ను తన నాయనమ్మ…అంటే చిరంజీవి తల్లి అంజ‌నా దేవి తో కలిసి ఈ సినిమా ను చూడాలి అనుకుంటున్నాడట. ఆచార్య సినిమాను తాను, త‌న తల్లిదండ్రులు, అలాగే త‌న నాన‌మ్మ అంజ‌నా దేవితో క‌లిసి చూడ‌టం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్లు చ‌ర‌ణ్ చెప్పాడు.

ఎందుకంటే..అప్పుడు నా కొడుకు ఎలా చేశాడో చూశావా అంటూ త‌న నాన‌మ్మ‌, తన అమ్మ ఇద్దరు సరదగా మాట్లాడుకుంటారని.. ఆ సీంతాను చూడాల‌ని కోరుకుంటున్నాన‌ని చ‌ర‌ణ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ సినిమాలో బాగా ఫేమస్ అయిన చరణ్, చిరు క‌లిసి డ్యాన్స్ చేసిన బంజారా పాట షూటింగ్ టైంలో వాళ్లు ఇద్దరు అటెండ్ అయ్యారని..అప్పుడు కూడా సేమ్ నా కొడుకు బాగా చేశాడంటే నా కొడుకు బాగా చేశాడ‌ని ఇద్ద‌రూ వాదించుకున్నార‌ని చ‌రణ్ చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news