Moviesపారిపోయి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే...!

పారిపోయి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

సినిమా రంగంలో హీరోయిన్లు అంటేనే గ్లామర్ బొమ్మలు అన్న ఇమేజ్ బాగా ఉంటుంది. హీరోయిన్లకు హీరోలాగా సుదీర్ఘకాలం లైఫ్‌ ఉండదు. ఎవరో నయనతార, అనుష్క లాంటి ఒకరిద్దరు హీరోయిన్లను పక్కన పెడితే చాలా మంది హీరోయిన్లకు ఏడెనిమిది సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగితేనే గొప్ప అన్నట్టుగా ఉంటుంది. అందుకే వాళ్లు ఫామ్‌లో ఉన్నప్పుడు… అవకాశాలు వరుసగా వస్తున్నప్పుడు మాత్రమే నాలుగురాళ్లు వెనకాల వేసుకోవాల్సి ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఒక్కసారి రేసులో వెనకబడిపోయింది అంటే మళ్లీ నిలదొక్కుకోవడం చాలా కష్టం. కీర్తి సురేష్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇక హీరోయిన్లకు కూడా ఒక మనసు ఉంటుంది… ఆ మనసు సహజంగానే ప్రేమను కోరుకుంటుంది.

హీరోయిన్ల‌లో కొంద‌రు తోటి హీరోల‌తో… మ‌రి కొంద‌రు ద‌ర్శ‌కుల‌తో ప్రేమ‌లో ప‌డుతూ ఉంటారు. అయితే ఈ ప్రేమ ఒక్కోసారి సక్సెస్ అవుతుంది.. మరి కొందరి విషయంలో సక్సెస్ కాకపోవచ్చు. ఇక ఎంతో ఇష్టంగా ప్రేమించిన వాళ్ల కోసం హీరోయిన్లు రిస్క్ చేసిన పారిపోయి పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు హీరోయిన్ల ప్రేమ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వాళ్ళు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అలా పారిపోయి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరు చూద్దాం.

ఖుష్బూ :
కోలీవుడ్లో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్‌గా పేరు అన్న సీనియర్ నటి ఖుష్బూ. అప్పుడు స్టార్ హీరోగా ఉన్న ప్రభుతో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయింది. అప్పట్లో ఖుష్బూ అంటే తమిళనాట ఎంతో క్రేజ్ ఉండేది. అక్కడ అభిమానులు ఆమెకు గుడి కట్టే వరకు వెళ్లారు అంటేనే ఆమెను ఆరాధించే అర్థమవుతోంది. ప్రభుతో ప్రేమాయణం విఫలమయ్యాక ఆమె డైరెక్టర్ సి. సుంద‌ర్‌ను వివాహం చేసుకుంది. వీరి ప్రేమకు ఖుష్బూ వాళ్ళ ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్లకు తెలియకుండానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఖుష్బూ హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

రోజా ఆర్కే :
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఉండి ఇప్పుడు బుల్లితెర జడ్జిగా… అటు ఎమ్మెల్యేగా దూసుకుపోతోంది రోజా. రోజాకు తెలుగునాట ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. విచిత్రమేంటంటే రోజా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆర్.కె.సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్ళికి రోజా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరు 2002లో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సెల్వమణిని తమ అల్లుడుగా రోజా కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఈ దంప‌తులు ఎంచ‌క్కా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

శోభ :
ఒకప్పటి టాప్ హీరోయిన్, క్లాసిక్ డ్యాన్సర్ అయిన శోభ కోలీవుడ్ టాప్‌ డైరెక్టర్ బాలు మహేంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లిని బాలు మహేంద్ర కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దీంతో పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే 1980లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఎంతో మంచి పేరు తెచ్చుకున్న శోభ జీవితం ప్రేమ పెళ్లితో విషాదంగా ముగిసింది.

శ‌ర‌ణ్య :
ఇక సీనియర్ నటి.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నా శరణ్యది సైతం బోల్డ్‌ వివాహమే అని చెప్పాలి. ఆమె డైరెక్టర్ పొన్న‌య‌న్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయినా వాళ్లను ఎదిరించి మరి పెళ్లి చేసుకుంది.

దేవ‌యాని :
ఒకప్పుడు పవన్ కళ్యాణ్, శ్రీకాంత్ లాంటి హీరోల పక్కన నటించిన దేవయాని డైరెక్టర్ రాజ్ కుమార్ ను ప్రేమించింది. అయితే రాజ్ కుమార్‌ను పెళ్లి చేసుకునేందుకు దేవయాని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మూడు సంవత్సరాల పాటు ఎదురుచూచిన వారు ఇద్దరు చివరికి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news