Movies2021 రివైండ్: పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీళ్లే..!!

2021 రివైండ్: పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీళ్లే..!!

2020 సంవత్సరం మొత్తం కరోనా మహమ్మారి కాటుకు బలైంది. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా అందరి జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఎంతోమంది ప్రాణాలను పోయాయి. కాగా 2020 సంవత్సరం పెళ్లి చేస్యుకోవాలి అనుకున్నవారు కరోనా కారణంగా పోస్ట్ పాన్ చేసుకుని 2021 లో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాదిలోను కరోనా మనల్ని వదల లేదు. కానీ కొందరి సెలబ్రిటీల జీవితంలో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. చాలామంది సెలబ్రిటీలు ఈ ఏడాదే వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కాకపోతే కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులతో అంగరంగ వైభవంగా వివాహ వేడుకను జరుపుకోవాల్సిన వారు సింపుల్ గా కొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలా కరోనా నిబంధనలు పాటిస్తూనే 202లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సెలబ్రిటీలు ఎవరో ఒక్కసారి రివైండ్ చేసుకుందాం.

సింగర్ సునీత – రామ్ వీరపనేని:

నిజానికి సునీతకు తన 19 ఏళ్లకే పెళ్లైంది . కానీ కొన్ని కారణాల వల్ల అతడికి విడాకులు ఇచ్చి తన ఇద్దరు పిల్లలతో సింగిల్ గానే జీవిస్తు వచ్చింది. అయితే ఈ యేడాది జనవరి 9వ తేదీన అంగరంగ వైభవంగా హైదరాబాద్ కు చెందిన అతి పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయిన రామ్ వీరపనేని ని వివాహం చేసుకుంది.

వరుణ్ ధావన్ – నటాషా దళాల్ :
బాలీవుడ్ స్టార్ హీరో అయిన వరుణ్ ధావన్ తన ప్రేయసిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రాణం కంటే ఎక్కువుగా ప్రేమించిననటాషా దళాల్ ను అంగరంగ వైభవంగా జనవరి 24వ తేదీ పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని ఆలీబాగ్ ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.

ప్రణీత సుభాష్ – నితిన్ రాజ్‌ : అత్తరింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ మరదలిగా నటించినప్రణీత సుభాష్ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది. మే 31న ప్రముఖ వ్యాపార వేత్త నితిన్ రాజ్‌ను సింపుల్‌గా చడీ చప్పుడు లేకుండా సాదాసీదాగా పెళ్లి చేసుకుంది.

యామీ గౌతమ్ – ఆదిత్య దర్ : బాలీవుడ్ బ్యూటి ఫేర్ అండ్ లవ్లీ ఫేమ్ యామీ గౌతమ్‌ కూడా ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కి ఊహించని షాకిచ్చింది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ‘యూరీ’ ఫేమ్ ఆదిత్య ధర్‌తో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులతో ఒకటయ్యారు ఈ జంట.

కార్తికేయ – లోహిత రెడ్డి :
ఇక టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ వివాహం కూడా ఈ ఏడాది తన స్నేహితురాలు లోహితరెడ్డితో జరిగింది. ఈ వేడుకకు ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. నవంబర్ 21న హీరో కార్తికేయ తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు.

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్: గత కొంత కాలం నుండి వీరు ప్రేమించుకుంటున్నారు అని వార్తలు హల్ చల్ చెసిన సంగతి తెలిసిందే. కాగా వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ జంట మూడు మూళ్ల బంధంతో ఒక్కటైయ్యారు. ఎన్నో నియమాలు నిబంధనలు మధ్య తక్కువమంది సెలబ్రెటీల సమక్షంలో డిసెంబర్ 9వ తేదీన ఏడడుగులు వేసారు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news