Gossipsఆ పాత్రకు ఓకే.. కానీ, మెలిక పెట్టిన క్రేజీ బ్యూటీ..??

ఆ పాత్రకు ఓకే.. కానీ, మెలిక పెట్టిన క్రేజీ బ్యూటీ..??

మెగాస్టార్ చిరంజీవి.. యంగ్ హీరోలతో పోటీ పడుతూ.. ఆరు పదుల వయసులో కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా దూసుకుపోతున్నాడు. ఈయన కుర్ర హీరోలలాగే ఒకే సంవత్సరంలో మూడు నుంచి నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్ప‌టికే కొరటాల శివ డైరెక్ష‌న్ లో ఆచార్య షూటింగ్ పూర్తి చేశాడు. ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజాతో లూసిఫ‌ర్ రీమేక్ షూటింగ్ తో బిజీగా అయిపోయాడు. ఈ సినిమాను శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

లూసీఫర్ మూవీ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కింది. ఇప్పుడు తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు మోహ‌న్ రాజా . ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే షురూ అయింది. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో విలక్షణ నటుడు సత్యదేవ్‌ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఒరిజినల్‌ వెర్షన్‌లో వివెక్‌ ఒబెరాయ్‌ పోషించిన పాత్రను తెలుగులో సత్యదేవ్‌ చేయనున్నాడు. అయితే సత్యదేవ్‌కు భార్యగా నయనతార నటించడానికి గ్రీన సిగనల్ ఇచ్చిందట.

మలయాళంలో మంజు వారియర్ పోషించిన హీరో సోదరి పాత్రను నయనతార చేస్తుందట. అంతేకాదు సత్యదేవ్‌కు భార్యగా నటించడానికి కొన్ని కండీషన్స్ పెట్టిందట. అంతేకాదు..ఈ పాత్రకి ఆమె పారితోషకం కూడా ఎక్కువ డిమాండ్ చేస్తుందట. ఇక అమ్మడుకున్న క్రేజ్ కి..ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కి అన్ని కండిషన్స్ పెట్టినా..ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా మేకర్ అందుకు ఒప్పుకునారట. ప్రస్తుత, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news