Gossipsసంచ‌ల‌న నిజాలు: లాక్‌డౌన్‌లో సుశాంత్ ఇంట్లోనే రియా.. 8 హార్డ్...

సంచ‌ల‌న నిజాలు: లాక్‌డౌన్‌లో సుశాంత్ ఇంట్లోనే రియా.. 8 హార్డ్ డిస్క్‌ల్లో ఏముంది..!

దివంగ‌త బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు ద‌ర్యాప్తు చేస్తోన్న సీబీఐ సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానీని ఆరో రోజు కూడా ప్ర‌శ్నించింది. ఈ క్ర‌మంలోనే సిద్ధార్థ్ ప‌లు విష‌యాలు వెల్ల‌డించిన‌ట్టు తెలుస్తోంది. క‌రోనా లాక్‌డౌన్ టైంలో రియా సుశాంత్‌తోనే క‌లిసి ఉంద‌ని సిద్ధార్థ్ చెప్పాడ‌ని టాక్‌. జూన్‌ 8న సుశాంత్‌తో గొడవ పడ్డ రియా చక్రవర్తి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిందని పేర్కొన్నారు.

అదే రోజు సుశాంత్ ఇంట్లో 8 హార్డ్ డిస్క్‌లు కూడా ధ్వంసం అయ్యాయ‌ని.. సుశాంత్‌, రియా స‌మ‌క్షంలోనే ఒక ఐటీ వ్య‌క్తి వ‌చ్చి ఇదంతా చేసిన‌ట్టు తెలిపారు. ఆ టైంలో సుశాంత్ మేనేజ‌ర్ దీపేష్‌, వంట మ‌నిషి ధీర‌జ్ కూడా ఉన్న‌ట్టు సిద్ధార్థ్ పోలీసుల‌కు చెప్పాడ‌ట‌. అయితే ఆ హార్డ్ డిస్క్‌ల‌లో ఏముందో త‌న‌కు తెలియ‌ద‌ని సిద్దార్థ్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇక రియాకు డ్రగ్స్‌ లికులు ఉన్నాయన్న నేపథ్యంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) రంగంలోకి దిగింది.

ఈ ఆరోప‌ణ‌ల‌పై రియాపై ఇప్ప‌టికే కేసు కూడా న‌మోదు అయ్యింది. ఇక ఇప్పుడు సుశాంత్ మృతి కేసులో దర్యాప్తు చేస్తున్న జాతీయ సంస్థల జాబితాలో ఈడీ, సీబీఐ తర్వాత ఎన్‌సీబీ కూడా చేరినట్లయింది. మరోవైపు సుశాంత్ తరపు న్యాయవాది వికాస్ సింగ్.. సుశాంత్‌ మరణం వెనుక పెద్ద కుట్ర జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆయ‌న ఈ కేసులో మ‌రికొంత మంది పెద్ద‌ల ప్ర‌మేయం ఉంద‌ని ఆరోపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news