యస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులర్ కి సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్.. ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించాడా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వరుణ్ తేజ్ తాజాగా నటించిన సినిమా “ఆపరేషన్ వాలంటైన్” .
ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు . కానీ మెసేజ్ ఓరియెంటెడ్ గా అభిమానులను ఆకట్టుకుంది . ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఫ్లాప్ అయినా సరే వరుణ్ అభిమానులను మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తుంది . ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లేడీ ఫ్యాన్ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేస్తూ .. “వరుణ్ తేజ్ గారు ఈ వీడియో పై కామెంట్ చేస్తే.. నేను 200 అనాధ పిల్లలకు ఆపరేషన్ వాలెంటైన్ మూవీ షోను ఏర్పాటు చేయిస్తాను “అంటూ రాస్కొచ్చింది.
ఈ పోస్ట్ పై వరుణ్ కూడా రియాక్ట్ అయ్యాడు . “చాలా మంచి ఆలోచన.. అయితే ఆ అనాధ పిల్లలకు నువ్వు కాదు నేనే షో ఏర్పాటు చేయిస్తా.. నా టీం నిన్ను సంప్రదించి.. నీ సూచనలతో ఆ షోలు ఏర్పాటు అయ్యేలా చేస్తాం .. నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది .. ఓ మధురమైన జ్ఞాపకంలా చేస్తాం ” అంటూ వరుణ్ తేజ్ కామెంట్ చేశారు. ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . వరుణ్ తేజ్ మంచి మనసు తెలుసుకొని ఫుల్ ఫిదా అయిపోతున్నారు అభిమానులు..!!