Movies"హీరోని నమ్మి సినిమా తీస్తే అంతే".. గుంటూరు కారం పై ఎస్వీ...

“హీరోని నమ్మి సినిమా తీస్తే అంతే”.. గుంటూరు కారం పై ఎస్వీ కృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్..!!

“గుంటూరు కారం”.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు నటించిన సినిమా ఈ సినిమాలో శ్రీ లీల – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది . అయితే గుంటూరు కారం సినిమాకి సంబంధించి ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో మనం చూశాం. అసలు త్రివిక్రమ్ మహేష్ కాంబోలో సినిమా అంటే ఒక అతడు.. ఒక ఖలేజా.. ఎక్స్పెక్ట్ చేశామని .. ఇది అజ్ఞాతవాసికి అమ్మ మొగుడిలా ఉంది అంటూ దారుణంగా ట్రోల్ చేశారు .

రీసెంట్గా స్టార్ డైరెక్టర్ ఎస్వి కృష్ణా రెడ్డి ఈ సినిమాపై సంచలన కామెంట్స్ చేశారు. ” ఒక డైరెక్టర్ కథను నమ్మి సినిమాను తెరకెక్కిస్తే ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ..పొరపాటున మనం హీరో క్రేజ్ ని బేస్ చేసుకుని సినిమా తెరకెక్కిస్తే ఆ సినిమా ఖచ్చితంగా మనకి నెగటివ్ మార్క్ తీసుకొస్తుందని సంచలన కామెంట్స్ చేశారు. పాపం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు కానీ గుంటూరు కారం సినిమా ఆయనకు నెగిటివ్ మార్కు తెచ్చి పెట్టింది .

దానికి కారణం ఆయన కథను నమ్ముకోకుండా హీరోయిజాన్ని నమ్ముకోవడమే అంటూ సంచలన కామెంట్స్ చేశారు . గతంలో ఆయన తెరకెక్కించిన శుభలగ్నం , మావిచిగురు సినిమాలు కథను నమ్ముకొని తెరకెక్కించానని ఆ కారణంగానే అవి హిట్ అయ్యాయని .. అదే విధంగా బాలకృష్ణ నాగార్జునతో టాప్ హీరో , వజ్రం సినిమాలను తెరక్కించానని ఆ సినిమాలు హీరోయ్జం తో బేస్ చేసుకుని తెరకెక్కించడం వల్ల ఫ్లాప్ అయ్యాయి అని .. అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయాయి అని చెప్పుకొచ్చారు”. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news