Moviesఆ ఒక్క మాట వినగానే.. స్టేజ్ పైనే చిన్న పిల్లాడిలా గుక్కపట్టి...

ఆ ఒక్క మాట వినగానే.. స్టేజ్ పైనే చిన్న పిల్లాడిలా గుక్కపట్టి ఏడ్చేసిన జెనీలియా భర్త(వీడియో)..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు వీడియోలు ఏ విధంగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జెనీలియా భర్త స్టేజిపై ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ఫ్యామిలీ ది పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ .

మహారాష్ట్రలోని లాతూరులో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ఎమోషనల్ అయిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తన దివంగత తండ్రి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ గురించి మాట్లాడుతూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు . తన తండ్రి దివంగత కాంగ్రెస్ నేత విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న కార్యక్రమంలో ఆయన స్టేజి పైకి వచ్చి మాట్లాడాడు. ఆ మూమెంట్లోనే తన తండ్రి గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు .

నాన్న చనిపోయి 12 ఏళ్లయింది అంటూ కన్నీరు పెట్టుకున్నారు . అంతేకాదు తన తండ్రి గురించి చాలా చాలా గొప్పగా వివరించారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. తెరపై నటించే నటులు అంత ఈజీగా స్టేజిపై ఎమోషనల్ అవ్వరు. కాని రితేష్ దేశ్ ముఖ్ మాత్రం తన తండ్రి గురించి మాట్లాడుతూ చిన్న పిల్లాడిలా గుక్క పట్టి ఏడ్చేయడం ఇప్పుడు అభిమానులకు కన్నీరు తెప్పిస్తుంది. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news