Moviesఅయోధ్య‌కు ఆ ఒక్క కార‌ణంతోనే జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ప్ర‌భాస్ వెళ్ల‌లేదా...!

అయోధ్య‌కు ఆ ఒక్క కార‌ణంతోనే జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ప్ర‌భాస్ వెళ్ల‌లేదా…!

దేశం మొత్తం ఎంతో ఆస‌క్తితో ఎదురు చూసిన అయోధ్య భ‌వ్య రామ‌మందిర ప్రాణ ప్ర‌తిష్ట క్ర‌తువు ఎంతో వైభవోపేతంగా జ‌రిగింది. దేశం మొత్తం రాముడి నామాలు, జై శ్రీరామ్ నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగిపోయింది. ఈ వేడుక‌ను చూసేందుకు దేశ‌వ్యాప్తంగా ప‌లు భాష‌ల‌కు చెందిన ఎంతోమంది టాప్ న‌టులు, న‌టీమ‌ణులు అయోధ్య‌కు చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ధ‌నుష్‌, అమితాబ‌చ్చ‌న్‌, కంగ‌నా ర‌నౌత్ ఇలా ఎంతో మంది అయోధ్య‌కు వెళ్లి ఈ మ‌హాఘ‌ట్టాన్ని స్వ‌యంగా తిల‌కించారు.

అయితే అయోధ్య నుంచి కొంద‌రు న‌టుల‌కు ఆహ్వానం అందినా కూడా వారు ఈ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం అనిపించింది. టాలీవుడ్ నుంచి ఈ క్ర‌తువుకు ఆహ్వానం అందుకున్న స్టార్ హీరోల‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ప్ర‌భాస్ ఇద్ద‌రూ ఉన్నారు. ఎన్టీఆర్ ఈ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కారణం అదే రోజు దేవ‌ర‌కు డేట్లు ఇచ్చారు. భారీ షెడ్యూల్ ఉంది. ప్ర‌తి రోజు కొన్ని వంద‌ల మంది షూటింగ్ చేస్తున్నారు. తాను అయోధ్య వెళితే నిర్మాత‌కు భారీ న‌ష్టం వ‌స్తుంద‌నే ఎన్టీఆర్ వెళ్ల‌లేదంటున్నారు.

అనుకోకుండా సైప్ ఆలీఖాన్ గాయ‌ప‌డ‌డం.. ఈ విష‌యం దేవ‌ర యూనిట్‌కు ఆల‌స్యంగా తెలియ‌డంతో ఎన్టీఆర్ చివ‌రి నిమిషంలో అయోధ్య ట్రిప్ ర‌ద్దు చేసుకున్నాడంటున్నారు. ఇక ప్ర‌భాస్ నాగ్ అశ్విన్ ప్రెస్టేజియ‌స్ ప్రాజెక్ట్ క‌ల్కి, మారుతి రాజాసాబ్ సినిమాల‌తో బిజీ ఉన్నాడు. అందులోనూ క‌ల్కి ఒక్క రోజు షూటింగ్ క్యాన్సిల్ అయితేనే కోట్ల‌లో న‌ష్టం వ‌స్తోంది.

ఈ కార‌ణంతోనే ప్ర‌భాస్ కూడా ఆహ్వానం ఉన్న‌ప్ప‌ట‌కీ అయోధ్య వెళ్ల‌లేద‌ట‌. ఇటీవ‌ల కృష్ణంరాజు జ‌యంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. అందులోనూ ప్ర‌భాస్ క‌నిపించ‌లేదు. ఏదేమైనా ఈ ఇద్ద‌రు క్రేజీ హీరోలు ఆహ్వానం ఉన్నా కూడా అయోధ్య భ‌వ్య‌రామ‌మందిర ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి వెళ్లే అదృష్టానికి నోచుకోలేక‌పోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news