Moviesమ‌హేష్ ' గుంటూరు కారం ' కు బ్యాడ్ టాక్ కుట్ర‌......

మ‌హేష్ ‘ గుంటూరు కారం ‘ కు బ్యాడ్ టాక్ కుట్ర‌… ఆ స్టార్ హీరో టీం నుంచే ప‌క్కా స్కెచ్‌లు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెర‌కెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. అసలే మహేష్ బాబు.. సర్కారు వారి పాట సినిమా తర్వాత ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకుని థియేటర్లలోకి వస్తున్నాడు. అటు టాలీవుడ్‌ను ఊపేస్తున్న క్రేజీ బ్యూటీ శ్రీలీల‌, మరో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్లు. అల వైకుంఠ‌పురంలో సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఖలేజా తర్వాత 13 సంవత్సరాలకి ఈ సినిమా వస్తుంది.. థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్.

ఇవన్నీ చాలు గుంటూరు కారం సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పేందుకు.. ఎందుకో గాని ముందు నుంచి ఈ సినిమా విషయంలో ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ వస్తోంది. రిలీజ్‌కు ఇంకా గట్టిగా నెల రోజుల టైం కూడా లేదు. అనుకున్న స్థాయిలో ప్రమోషన్లు మొదలు కాలేదు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, పాటలు కూడా సినిమాపై ఉన్న భారీ అంచనాలతో పోలిస్తే.. ఆ అంచనాలు అందుకోలేదని చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన తొలి సాంగ్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. తాజాగా ఓ మై బేబీ సాంగ్ రిలీజ్ అయింది.

ఇప్పుడు ఈ సాంగ్‌ను కూడా సోషల్ మీడియాలో చాలామంది టార్గెట్ చేస్తున్నారు. పైగా మహేష్ బాబు అభిమానులకే ఈ రెండు పాటలు నచ్చలేదు.. అంటూ సోషల్ మీడియాలో గట్టిగా యాంటీ ప్రచారం నడుస్తోంది. వాస్తవంగా బేబీ పాట అంత బాగోలేదా అంటే హీరో మీద ఇష్టంగా.. హీరోయిన్ పడుకునే మెలోడీ సాంగ్ ఇది. రామ జాగయ్య శాస్త్రి సాహిత్యం రాశారు. ఒక మోస్త‌రుగా ఉంది. అయితే థ‌మన్ రాములో రాములా.. ట్యూన్ కొంతవరకు కాపీ చేశారని చెబుతున్నారు. అయితే ఈ సాంగ్ పై యాంటీ ప్రచారం మొదలు కావడంతో పాటల రచయిత రామ జోగ‌య్య‌శాస్త్రి ఆ పాటకు ఏం తక్కువయింది అని వారిని ప్ర‌శ్నించారు. ఆయనపై ట్రోలింగ్ గట్టిగా నడుస్తోంది.

దీంతో ఆయన చిరాకు పడి ట్విట్టర్ డిఆక్టివేట్ చేశారు. మామూలుగానే నిర్మాత సూర్యదేవర నాగ‌వంశీ కాస్త దూకుడు మనిషి. మీ ట్రోల్స్ మాకు దీనితో సమానం అని అర్థం వచ్చేలా.. యానిమల్ సినిమాలోని మంకీ స్టోరీ విజువల్ పోస్ట్ చేశారు. దీంతో మ‌రింత గొడ‌వ‌లు రాజుకున్నాయి. అయితే ఈ నెగటివ్ ప్రచారం మహేష్ బాబు అంటే గిట్టని ఓ స్టార్ హీరో అభిమానుల ఆధ్వర్యంలో ప్రారంభమైందని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల క్రితం సంక్రాంతికి మహేష్ బాబుతో పాటు ఆ హీరో సినిమా రెండు పోటాపోటీగా వచ్చాయి. ఈ విషయంలో ఇద్దరు వెనక్కి తగ్గలేదు. పంతానికి పోయారు.. అప్పుడు ఆ హీరో సినిమా కాస్త పై చేయి సాధించింది.

అప్పటినుంచి ఆ హీరో మహేష్ బాబును బాగా టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు అన్న ప్రచారం ఇండస్ట్రీలో ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు గుంటూరు కారం సినిమా విషయంలో సదరు స్టార్ హీరో టీం.. తెరవెనక నుంచి గుంటూరు కారంపై.. ముందు నుంచే పక్కా ప్లానింగ్ తో నెగిటివ్ ప్రచారం చేస్తుందని అంటున్నారు. అయితే ఈ ట్రాప్‌లో అనవసరంగా గుంటూరు కారం సినిమా నిర్మాతలు రామ జోగ‌య్య‌శాస్త్రి, థ‌మన్‌లాంటి వాళ్ళు పడుతున్నారు.

వాళ్లు స్పందించకుండా తమది తాము చేసుకుంటూ పోతే ఇబ్బంది ఉండదు. అలా మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా మేకర్స్ మధ్య చిచ్చు పెట్టి సినిమాపై రిలీజ్‌కు ముందే హైప్‌ తగ్గించాలన్నదే ఆ హీరో టీం ప్లాన్ గా తెలుస్తోంది. సహజంగానే ఏ సినిమా విషయంలో అయినా రిలీజ్‌కి ముందు కొన్నిసార్లు పాజిటివ్గా, కొన్నిసార్లు నెగిటివ్ గా ప్రచారం జరుగుతుంది. దానిని మేకర్స్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే మంచిది. అంతిమంగా సినిమాలో దమ్ము ఉంటే ఈ ప్రచారాలు అన్ని గాలిలో కొట్టుకుపోతాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news