News"ఛీ పో " అంటూ వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ చుట్టూనే మళ్ళీ...

“ఛీ పో ” అంటూ వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ చుట్టూనే మళ్ళీ తిరుగుతున్న చిరంజీవి.. మెగాస్టార్ గతిలేక అలా చేస్తున్నాడా..?

నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన త్రిష కృష్ణన్ ఆ తర్వాత వర్షం సినిమాతో టాలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ లోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, కృష్ణ, దమ్ము, నమో వేంకటేశ, కింగ్, బాడీగార్డ్, అతడు, ఆడవారి మాటలకై అర్థాలే వేరులే, సైనికుడు..ఇలా తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరీల సరసన నటించింది.

తమిళంలో సూర్య, ధనుష్, విజయ్, కమల్ హాసన్..ఇలా అక్కడ కూడా దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. ఇలా సౌత్ లో త్రిష 10 ఏళ్ళపాటు క్షణం తీరిక లేకుండా గడిపింది. మధ్యలో కొన్ని ఫ్లాపులు రావడంతో త్రిష కెరీర్ అయిపోయిందనుకున్నారు. కానీ, తమిళంలో 96 సినిమా మంచి కంబ్యాక్ మూవీగా నిలిచింది. ఈ సినిమా తర్వాత త్రిష మళ్ళీ తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది.

పొన్నియన్ సెల్వన్ సిరీస్, ఇటీవల విజయ్ తో లియో చేసి ఫాంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే మళ్ళీ తెలుగులో సీనియర్స్ పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమాలో త్రిషని తీసుకున్నారట. కానీ, ఈమె గతంలో చిరంజీవితో కలిసి స్టాలిన్ సినిమాలో నటించింది. ఆ సమయంలో చిరంజీవిని అసలు లెక్క చేయలేదని సెట్ లో ఆయన ఉన్నా కూడా ఆలస్యంగా వచ్చిందని టాక్ ఉంది.

అప్పట్లోనే చిరంజీవి త్రిష విషయంలో దర్శకనిర్మాతలకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారట. కానీ, ఇప్పుడు ఆయనే మళ్ళీ త్రిషని హీరోయిన్‌గా తీసుకోమని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన ఇటీవల రాజుకున్న త్రిష-మున్సూర్ అలీ వివాదంలో తలదూర్చి విషయం సద్దుమణిగేలా చేసినట్టు తెలుస్తోంది. మరి అప్పట్లో ఆయనే త్రిషపై కంప్లైట్ చేసి ఇప్పుడు హీరోయిన్స్ కొరతవల్ల అన్నీ మర్చిపోయి ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news