News"ఆ టైంలో ..అందరి మగాళ్లు అంతే"..పచ్చిగా చెప్పేసిన సురేఖా వాణి... న‌మ్మించి...

“ఆ టైంలో ..అందరి మగాళ్లు అంతే”..పచ్చిగా చెప్పేసిన సురేఖా వాణి… న‌మ్మించి మోసం చేసినోడే టార్గెట్‌..!

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత రెండు దశాబ్దాలుగా ఎన్నో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. నాలుగున్న‌ర‌ పదుల వయసులో ఉన్న సురేఖవాణి.. భర్త మృతి చెందిన కూడా ఏమాత్రం ఆ బాధ లేకుండా తన లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. 22 సంవత్సరాల తన కూతురు సుప్రీతతో కలిసి సురేఖ చేసే ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. అత్తగా, అక్కగా, పిన్నిగా, వదినగా ఎన్నో పాత్రలలో నటించిన‌ సురేఖ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ వయసులోనూ తన కూతురుతో కలిసి హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అసలు ఈ తల్లి, కూతుళ్ళు పక్కపక్కనే కూర్చుని మందు కొడుతూ ఫోజులు ఇస్తూ ఉంటారు. చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని కవ్విస్తూ ఉంటారు. వీళ్ళను చూస్తుంటే వీళ్ళు తల్లీకూతుళ్లేనా అన్న సందేహాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో సురేఖవాణి ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేసింది. అందులో మగాళ్ళ బుద్ధి గురించి కామెంట్ చేసింది.

గతంలో ఎన్నో సందర్భాలలో పోకిరీలు.. సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేసే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిన సురేఖవాణి.. ఇప్పుడు ఏకంగా మగాళ్ళ బుద్ధిని టార్గెట్ చేసింది. మగాళ్లు అందరూ కూడా మమ్మల్ని రీచ్ అయ్యేవరకు ఒకలాగే ఉంటారు.. రీచ్ అయిన తర్వాత అందరూ ఒకేలాగా మారతారు అంటూ ఓ రీల్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీంతో కొందరు నెటిజెన్లు సురేఖ వాణిని నమ్మించి ఎవరో ? మోసం చేశాడు కావచ్చు. అందుకే అతనిని టార్గెట్ చేస్తూ అలా పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి సురేఖను ఎవరు ఏ విషయంలో నమ్మించి..? ఏం మోసం చేశాడో..? అన్నది ఆమెకే తెలియాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news