Newsఅంగరంగ వైభవంగా వరుణ్-లావణ్య పెళ్లి..మెగా ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మిస్సింగ్.....

అంగరంగ వైభవంగా వరుణ్-లావణ్య పెళ్లి..మెగా ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మిస్సింగ్.. మీరు గమనించారా..!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ పెళ్లి కొద్ది గంటల క్రితమే అంగరంగ వైభవంగా జరిగింది . ఇటలీ దేశంలో హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు . వీళ్ళు తొలిచూపులోనే అట్రాక్ట్ అయిన దేశంలోనే తమ పెళ్లి జరగాలి అని నిర్ణయించుకొని అభిమానులకు స్నేహితులకు దూరంగా కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది .

వీళ్ళ పెళ్లికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించిన కొన్ని క్రేజీ పిక్స్ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు . ఈ పిక్చర్స్ లో అంతా బాగున్న ఒక పెద్దాయన మాత్రం మిస్సయ్యారు . దీంతో అభిమానులకు కొత్త డౌట్లు వస్తున్నాయి. అది కూడా మెగా ఫ్యామిలీకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కావడం ఇక్కడ గమనార్హం. ఎస్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలు అల్లు అరవింద్ మిస్ అయ్యారు .

అల్లు అరవింద్ లేకుండా మెగా ఫ్యామిలీలో ఏ ఈవెంట్ .. ఏ పండగ జరగదు. మరి అలాంటిది ఎందుకు ఆయన రాలేదు..? ఎందుకు ఆయన లేకుండానే ఈ పెళ్లి జరిగింది..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది . అంతేకాదు ఎన్ని పనులు ఉన్నా సరే ..అల్లు అరవింద్ మెగా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కచ్చితంగా మెరుస్తారు . కానీ వరుణ్ తేజ్ పెళ్లికి రాకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు దారితీస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news