Newsభోళా శంకర్ కంటే ముందే చిరంజీవి-కీర్తి సురేష్ కాంబోలో మిస్ అయిన...

భోళా శంకర్ కంటే ముందే చిరంజీవి-కీర్తి సురేష్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..రిజెక్ట్ చేసి బ్రతికిపోయాడు పో..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి లాస్ట్ గా నటించిన సినిమా భోళాశంకర్ . మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరమత చెత్త టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు చిరంజీవి కెరియర్ లోనే నికృష్టమైన కలెక్షన్ సాధించింది . ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటించింది. చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ కనిపించింది .

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో తమన్నాను – కీర్తి సురేష్ ని జనాలు ఏకేశారు. అయితే కీర్తి సురేష్ చిరంజీవి కాంబోలో ఆల్రెడీ ముందే ఒక సినిమా రావాల్సి ఉంది , కానీ ఆ సినిమా మిస్సై ఇలా మరో కాంబోలో భోళా శంకర్ సినిమా ఫిక్స్ అయ్యింది. వీళ్ల కాంబోలో రావాల్సిన ఫస్ట్ సినిమా గా తెరకెక్కింది ఆ సినిమా మరేదో కాదు గాడ్ ఫాదర్ .

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి మెయిన్ లీడ్ పాత్రలో నటించి .. నయనతార సిస్టర్ రోల్ లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది .ఈ సినిమాలో నయనతార ప్లేస్ లో ముందుగా కీర్తి సురేష్ ని అనుకున్నారట . కానీ పాత్ర బరువు ఎక్కువ ఉండడం .. అలాంటి బరువు ఉన్న ఫీలింగ్స్ ను కీర్తి సురేష్ ఎక్స్ ప్రెస్ చేయలేకపోతుందేమో అని భయపడి డైరెక్టర్ మనసు మార్చుకున్నారట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం నయన్ ని చూస్ చేసుకున్నారు. అలా చిరంజీవి కీర్తి సురేష్ రావాల్సిన కాంబో మిస్ అయ్యింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news