Newsఎన్టీఆర్ ' జనతా గ్యారేజ్ ' - విజయ్ దేవరకొండ '...

ఎన్టీఆర్ ‘ జనతా గ్యారేజ్ ‘ – విజయ్ దేవరకొండ ‘ ఖుషి ‘ సినిమాకు ఉన్న ఇంట్ర‌స్టింగ్ లింక్ ఇదే..!

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటి.. మహేష్ హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ఈ సంస్థ వరుస స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ భారీ విజయాలు అందుకుంటూ వస్తుంది. అలాంటి ఈ సంస్థకు సెప్టెంబర్ నెల అంటే ఎంతో లక్కీ… ఏడు సంవత్సరాల క్రితం మైత్రి నిర్మించిన జనతా గ్యారేజ్ 2016 సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా కూడా ఇదే. అప్పటికి ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా టాలీవుడ్ ను టాప్ గ్రాసర్‌గా నిలిచింది. మొన్నటితో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ విడుదలై ఏడేళ్ళు పూర్తి చేసుకుంది. మళ్లీ ఇదే సమయానికి మైత్రి మూవీ మేకర్స్ మరింత ఖుషీగా ఉంది.

అందుకు కారణం విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్మాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ వారు నిర్మించిన ఖుషి సినిమా ఈ నెల ఒకటో తారీఖున ప్రేక్షకుల‌ ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్‌ తెచ్చుకొని మంచి హిట్‌గా నిలిచింది. గ‌త కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ కి ఖుషీ రూపంలో మంచి హీట్ వచ్చినట్లే అయింది. మైత్రి నిర్మాతలు ఫుల్ ఖుషిగా ఉన్నారు.

మొత్తానికి అప్పుడు జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మైత్రి వారు.. ఖుషి తో విజయ్ దేవరకొండ కి అదిరిపోయే మంచి కం బ్యాక్ ఇచ్చారనే చెప్పాలి. ఈ విధంగా సెప్టెంబర్ నెల ఈ నిర్మాణ సంస్థకి బాగా కలిసి వచ్చింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్‌గా నటించింది సమంత కావటం మరో విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news