Newsమ‌హేష్‌బాబు మ‌ర‌ద‌లిని గుర్తు పట్టారా... ఈమె ఎవ‌రు... ఏం చేస్తోందంటే...!

మ‌హేష్‌బాబు మ‌ర‌ద‌లిని గుర్తు పట్టారా… ఈమె ఎవ‌రు… ఏం చేస్తోందంటే…!

సురేందర్ రెడ్డి కి టాలీవుడ్ లో విలక్షణమైన సినిమాలు తీసే వ్యక్తిగా మంచి పేరు ఉంది. సురేందర్ రెడ్డికి కొన్ని సూపర్ డూపర్ హిట్లతో పాటు కొన్ని ప్లాపులు కూడా ఉన్నాయి. అలాంటి ప్లాప్ సినిమాల్లో మహేష్ బాబు హీరోగా చేసిన అతిధి ఒకటి. ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల అంచనాలు అందుకోవటంలో ఘోరంగా విఫ‌లం అయ్యింది. మహేష్ కి భారీ హిట్‌గా నిలిచిన పోకిరిలా ఉంటుందని జనాలు ఆశలతో ఉంటే పెద్ద డిజాస్టర్ అయింది.

2007 చివర్లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యాక మూడున్నర సంవత్సరాల పాటు మహేష్ బాబు సినిమాలు పూర్తిగా దూరంగా ఉన్నాడు.. అంటే ఈ సినిమా పరాజయంతో మహేష్ ఎంత డీలా పడిపోయాడో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ హీరోయిన్ అమృతారావు మహేష్ కు జోడిగా నటించారు. అమృత రావు తల్లిదండ్రులు తనను చిన్నతనంలో బాగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పటానికి వారి ఇంటికి వస్తాడు మహేష్. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి.

ఇందులో హీరోయిన్ సోదరిగా కూడా ఒక క్యూట్ గర్ల్ నటించింది. ఈ సినిమాలో ఆమె బ్రహ్మానందం కూతురు.. ఆమె పేరు కర్మన్ సింధు. అతిధి కర్మన్ నటించిన మొదటి సినిమా అయినా కూడా ఆమె కెమెరా ముందు చాలా కాన్ఫిడెంట్గా నేచురల్ గా నటించడంతోపాటు మంచి నటన ప్రదర్శించింది. ఈ సినిమాలో ఆమె నటన‌కు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె చనిపోయి ప్రేక్షకులను బాధపెడుతుంది. సురేందర్ రెడ్డి సింధు పాత్రను చంపి పెద్ద రిస్క్ చేసినా అది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.

అతిథి తర్వాత ఆమె సినిమాలపై ఆసక్తిగా లేకపోవడంతో నటించలేదు. ఆమె సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ కనిపించలేదు. ఆమె ఇప్పుడు హైదరాబాదులో ప్రముఖ సైకాలజిస్ట్ గా ఉన్నారు. మానసిక సమస్యలతో బాధపడే వారికి సహాయం చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతిథి సినిమాలో ఆమె నటించినప్పటికీ.. ఇప్పటికీ చాలా మారిపోయిందని అసలు ఆమె గుర్తుపట్టలేనంగా లేనంతగా ఉందన్న కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news