Newsఅఖిల్ ఆమె కోసం మారాం చేస్తున్నాడా... మొండి ప‌ట్టు ప‌డుతున్నాడా...!

అఖిల్ ఆమె కోసం మారాం చేస్తున్నాడా… మొండి ప‌ట్టు ప‌డుతున్నాడా…!

అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ హ్యాండ్సమ్ హీరో వరుసగా రెండు సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో కొత్త దర్శకుడితో ధీర అనే సినిమాలో చేయనున్నాడు. ఈ సినిమా గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అఖిల్ మరొక సినిమాను ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలతో కలిసి చేయనున్నాడు. ధీర సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుంది.

అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో చేస్తున్న ధీర ఒక పీరియాడికల్ సినిమా అని టాక్‌. ఈ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్‌గా తీసుకోవాలని అఖిల్ మూవీ మేకర్స్ ను కోరినట్లు సమాచారం. పూజాకి తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. ఆమె అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గ్లామర్ షో కూడా అందరికంటే ఎక్కువగానే చేస్తుంది. ప్రస్తుతం పూజాకు తెలుగులో సినిమాలు లేవు, కాబట్టి ఆమె ధీరలో నటించడానికి కచ్చితంగా అంగీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అఖిల్, పూజా హెగ్డే కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే, ఇది అఖిల్ కెరీర్‌లో మొదటి కమర్షియల్ హిట్ అయింది. ఆమెతోనే తనకు లక్కు కలిసి వచ్చిందని అఖిల్ బాగా నమ్ముతున్నాడు. అందుకే ఇప్పుడు అఖిల్ పూజాను ధీర సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని మొండి పట్టుబడుతున్నాడని ఇన్సైడ్ టాక్‌. గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోల్పోయాక పూజా చాలా నిరాశ పడిపోయింది.

బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి అవకాశాలు ఏమీ రావడం లేదు. దాంతో తనకి బ్రేక్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీలోనే ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంది. ఆమె రవితేజ గోపీచంద్ మలినేని కాంబో సినిమాలో కూడా నటించే అవకాశం ఉంది, కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పూజా హెగ్డే సీనియర్ స్టార్స్‌తోనే కాక యంగ్ హీరోలతో కూడా రొమాన్స్ చేయడానికి సిద్ధపడుతుంది.

ఏజెంట్ లో హీరోయిన్ సాక్షి వైద్య ఏ విషయంలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అందుకే అలాంటి కొత్తవారు కాకుండా ధీర సినిమాలో కథానాయికగా పూజా ని తీసుకోవాలని అఖిల్ మేకర్స్ తో చెబుతున్నట్లు టాక్. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు అఖిల్ కెరీర్ ని కాపడతాయా లేదా అనేది చూడాలి మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news