Moviesసైలెంట్ షాకిచ్చిన బాలయ్య హీరోయిన్..గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్ధం.. అబ్బాయి ఎంత తోపు...

సైలెంట్ షాకిచ్చిన బాలయ్య హీరోయిన్..గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్ధం.. అబ్బాయి ఎంత తోపు అంటే..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు అందరూ ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకొని తమ లైఫ్ లో సెకండ్ స్టెప్ వేస్తున్నారు. కాగా ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ ముద్దుగుమ్మలు అందరూ పెళ్లిళ్లు చేసుకుని బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు అందజేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ నటాషా దోషి కూడా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది.

ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు బాలకృష్ణ నటించిన “జైసింహ” సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్గా నటించిన నటాషా దోషి అంటే మాత్రం అందరికీ గుర్తువచేస్తుంది. కాగా ఆ సినిమాలో తనదైన స్టైల్ లో నటించి బాలయ్య ను తన నటన తో మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువగా మెరిసింది . అయినా సరే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిరంతరం టచ్ లో ఉండే ఈ బ్యూటీ రీసెంట్గా గుడ్ న్యూస్ అందజేసింది .

శుక్రవారం నటాషా దోషి నిశ్చితార్థం జరిగింది . దీనికి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. ” మనన్ షా” అనే యువకుడితో ఆమె ఏడు అడుగులు వేయ్యబోతున్నట్లు ఉంగరాలు మార్చుకున్నట్లు ఫోటోలు ద్వారా చెప్పింది . అయితే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు . అంతేకాదు ప్రేమ ఎప్పుడు విజయం సాధిస్తుందని పేర్కొనింది.

దీన్ని బట్టి ప్రేమ వివాహం అని చెప్పుకొస్తున్నారు జనాలు. కాగా జై సింహ కంటే ముందు మలయాళం లో నటాషా దోషి పలు సినిమాలు చేసింది . అయినా క్లిక్ అవ్వలేకపోయింది. ప్రజెంట్ నటాషా దోషికు శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు ఆమె ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news