Moviesఎన్టీఆర్ `సింహాద్రి` - బాల‌య్య `వీరసింహారెడ్డి` మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్...

ఎన్టీఆర్ `సింహాద్రి` – బాల‌య్య `వీరసింహారెడ్డి` మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్ చూశారా…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషన్ హిట్ సింహాద్రి రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భూమిక‌, అంకిత హీరోయిన్లుగా న‌టిస్తే.. కీర‌వాణి స్వ‌రాలు అందించారు. 2003లో విడుద‌లైన ఈ చిత్రం ఆల్‌టైమ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ మూవీగా నిలిచింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది.

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 20న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సింహాద్రికి భారీ ఎత్తున ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. తాజాగా రీ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వ‌హించారు. అయితే సరిగ్గా గ‌మ‌నించిన‌ట్లైతే.. ఎన్టీఆర్ సింహాద్రి, బాల‌య్య వీర‌సింహారెడ్డి చిత్రాల మ‌ధ్య ఒక కామ‌న్ పాయింట్ ఉంది.

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న వీర‌సింహారెడ్డి.. ఈ ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ మిట్ గా నిలిచింది. అయితే బాబాయ్ వీర సింహారెడ్డి అలాగే అబ్బాయ్ సింహాద్రి ఇంట్రవెల్ సీన్ ఒక‌టే. సింహాద్రిలో ఎన్టీఆర్ ను భూమిక క‌త్తితో పొడిచేస్తుంది. అలాగే వీర సింహారెడ్డిలో బాల‌య్య‌ను వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ పొడిచేస్తుంది.

పైగా రెండు సినిమాల్లోనూ ఇంట్రవెల్ సీన్ కు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఆయా సీన్స్ చూస్తుంటే ప్రేక్ష‌కుల్లో గూస్ బంప్స్ వస్తాయి. ఇక సేమ్ టు సేమ్ ఇంట్రవెల్ సీన్ తో తెర‌కెక్కిన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్స్ గా నిలిచి కాసులు వ‌ర్షం కురిపించాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news