Movies"ఆమె కంటే నేనే బాగుంటాను"..రష్మిక పరువు తీసేసిన ఐశ్వర్య.. అంత మాట...

“ఆమె కంటే నేనే బాగుంటాను”..రష్మిక పరువు తీసేసిన ఐశ్వర్య.. అంత మాట అనేసింది ఏంట్రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ని కొంతమంది జనాలు ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. పెద్దగా కలర్ లేకపోయినా.. చూడడానికి అందంగా లేకపోయినా సరే.. వాళ్ళని మనసులో పెట్టుకొని ఉంటారు . ఆలిస్ట్ లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తెలుగులో పలు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ..

రీసెంట్గా డైరెక్టర్ నెల్సన్ వెంకటేశం దర్శకత్వం వహించిన “ఫర్హాన్” అనే సినిమా ద్వారా అభిమానులను పలకరించింది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో తెలుగు ఇండస్ట్రీ ని ఓ రేంజ్ లో పొగిడేసింది ఐశ్వర్య రాజేష్ . ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్ రష్మిక మందన పై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి .

మనకు తెలిసిందే రష్మిక మందన కు లైఫ్ ఇచ్చిన సినిమా ఏది అంటే టక్కులు చెప్పేది పుష్ప. ఈ సినిమా చేయకుండా ఉంటే రష్మిక కెరియర్ ఎంత డౌన్ ఫాలో అయ్యేదో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . “ఆ సినిమాలో రష్మిక పాత్ర బాగున్నప్పటికీ.. ఆమె బాగా నటించినప్పటికీ .. నేనైతే బాగా చేసి ఉండే దాన్ని అన్న ఫీలింగ్ నాకు ఉంది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్ “. అంతేకాదు ఆ మాటలకు జనాలు సైతం వత్తాసు పలుకుతున్నారు . నిజంగానే ఆ పాత్ర గనుక ఐశ్వర్య రాజేష్ చేతికి వచ్చుంటే సినిమా మరింత రేంజ్ లో హిట్ అయ్యుండేది అని అంత నాచురల్ గా నటించగలరు ఐశ్వర్య రాజేష్ అని చెప్పుకొస్తున్నారు. అయితే దీనిపై రష్మిక మందన ఫ్యాన్స్ మాత్రం ఆమెపై మండిపడుతున్నారు . దీంతో ఐశ్వర్య రాజేష్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news