Moviesఎన్టీఆర్ కు పిచ్చ కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా.. కిచెన్...

ఎన్టీఆర్ కు పిచ్చ కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా.. కిచెన్ లోకి పరిగెత్తుకుంటా వెళ్లి.. వెరీ ఫన్నీ..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . ప్రజెంట్ ఎన్టీఆర్ థర్టీ అనే సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నాడు . ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది . మరి కొద్ది రోజుల్లోనే గోవాలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓ టాక్ షో కి హోస్టుగా చేయబోతున్నాడు .

ఇది అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ 31 సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళిపోతున్నాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ షోలకి సినిమాలకు కమిట్ అయిన తారక్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ కి కోపం ఎక్కువ.. రీసెంట్గా లైవ్ లోనే సుమ ని ఎలా కోప్పడ్డారు మనం చూసాం . స్పాంటేనియస్ గా నటించడం కోపం వస్తే ఉన్నది ఉన్నట్లు ప్రదర్శించడం ఎన్టీఆర్ కి మొదటి నుంచి అలవాటు .

ఈ క్రమంలోని జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో ఎప్పుడైనా కోపం వచ్చిన టెన్షన్ గా ఫీల్ అయిన ఫస్ట్ ఆయన కిచెన్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయనకి ఇష్టమైన చికెన్ ధమ్ బిర్యాని చేసుకొని తినేస్తాడట . ఎన్టీఆర్ బిర్యాని చేయడంలో ఎంత ఎక్స్ పర్టో మనకు తెలిసిందే . బిగ్ బాస్ సీజన్ వన్ లో అందరికీ బిర్యానీ చేసి వండి పెట్టి మెస్మరైజ్ చేశాడు . ఇలా ఎన్టీఆర్కి కోపం వచ్చినా.. ఆవేశం వచ్చిన.. బాధ వచ్చిన ఫస్ట్ కిచెన్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఏదో ఒక వంట చేసుకొని గబగబా తినేస్తాడట . అప్పుడు ఆయన కోపం కూల్ అయిపోతుందట . ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెరీ ఫన్నీ అంటూ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news