Moviesఆ రోల్ తారక్ చేసుంటే.. బాక్స్ ఆఫిస్ షేక్ అయ్యుండేది..గోపీచంద్ కామెంట్స్...

ఆ రోల్ తారక్ చేసుంటే.. బాక్స్ ఆఫిస్ షేక్ అయ్యుండేది..గోపీచంద్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ నందమూరి  బాలయ్య హీరోగా నటించిన రీసెంట్ సినిమా వీరసింహారెడ్డి . గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ పాజిటివ్ హిట్ అందుకుంది. అంతేకాదు బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది.

మొదటి రోజే యాభై నాలుగు కోట్లు టార్గెట్ ని ఫినిష్ చేసి సినిమా ఇండస్ట్రీలోనే మరో సంచలనానికి తెరలేపింది, కాగా వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి, జై సింహ రెడ్డి అనే రెండు పాత్రల్లో బాలయ్య నటించిన మెప్పించారు . అయితే చాలామంది సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి జై సింహారెడ్డి పాత్రలో ఎన్టీఆర్ ని పెట్టుంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేదని.. ఇండస్ట్రీ షేక్ అయిపోయి ఉండేదని చెప్పుకొచ్చారట.

ఎప్పటినుంచో తారక్ బాలయ్య కలిసి.. నటిస్తే చూడాలన్నది నందమూరి అభిమానుల కోరిక అని ..మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నామని చెప్పుకొచ్చారు అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో గోపీచంద్ ఓపెన్ అప్ అయ్యాడు. నిజంగానే అలా చేసుంటే బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యుండేదని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news