Moviesమ‌హానటి ' సావిత్రి ' న‌డుం మ‌డ‌త‌ల వెన‌క ఇంత స్టోరీ...

మ‌హానటి ‘ సావిత్రి ‘ న‌డుం మ‌డ‌త‌ల వెన‌క ఇంత స్టోరీ ఉందా…!

మ‌హాన‌టి సావిత్రి గురించి అంద‌రికీ తెలిసిందే. తెలుగు సినీ రంగంలో అనేక అద్భుత‌మైన అజ‌రామ‌ర దృశ్య కావ్యాల‌ను అందించారు. ఇప్పుడంటే.. ఒక‌టిరెండు సినిమాల‌తోనే హీరోయిన్లు ఇండ‌స్ట్రీకి గుడ్ బై చెబుతున్నారు. అయితే.. కొంద‌రు మాత్రం పెళ్లి చేసుకుండా ఉండిపోయి మ‌రీ న‌టిస్తున్నారు. అయితే.. గ‌తంలో అలా ఉండేది కాదు. సావిత్రి, భానుమ‌తి, అంజ‌లీదేవి.. వంటి మెగా హీరోయిన్లు.. స‌మ‌యానికి వివాహం చేసేసుకున్నారు.

ఆఫ‌ర్లు వ‌స్తాయా.. రావా.. అని కూడా ఆలోచించ‌కుండా.. నిజ‌జీవితంలోనూ.. వారు ప్ర‌యాణం సాగించారు. అయితే.. అప్ప‌టి సినీ ఇండ‌స్ట్రీ వారిని వివాహం అయిన త‌ర్వాత కూడా ఆద‌రించింది. అంజ‌లీదేవి ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను క‌న్న త‌ర్వాత కూడా హీరోయిన్‌గానే న‌టించారు. భానుమ‌తి కూడా త‌న కుమారుడిని తీసుకువ‌చ్చి.. స్టూడియోల్లో సంద‌డి చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. పెళ్లయినా.. పిల్ల‌లు ఉన్నా.. వారు హీరోయిన్లుగానే కొన‌సాగారు.

అయితే..సావిత్రి విష‌యానికి వ‌స్తే.. ఆమెకు ఉన్న వ్య‌క్తిగ‌త అల‌వాట్ల కార‌ణంగా.. లావెక్కి పోయారు. భ‌ర్త జెమినీ గ‌ణేష‌న్‌తో వివాదాలు, విభేదాల‌తో నిత్యం ఆమె ఒక విధ‌మైన ఆందోళ‌న‌లో ఉండేవారు. ఆర్థిక‌ప‌ర‌మైన ఆందోళ‌న‌ల‌తో ఆమె విప‌రీతంగా డ్ర‌గ్స్‌, మ‌ద్యానికి బానిస అయిపోయారు. ఆమె వ్య‌క్తిగ‌తంగా ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్‌కు గురైనా షూటింగుకు మాత్రం న్యాయం చేసేవారు.

కానీ, లావై పోవ‌డంతో ఆమెను హీరోయిన్ ప్లేస్ నుంచి చాలా వ‌ర‌కు త‌ప్పించేశారు. రెండు ద‌శాబ్దాల పైచిలుకు.. సిని జీవితంలో ఉత్థాన ప‌త‌నాలు చ‌విచూసిన సావిత్రి హీరోయిన్‌గా ఒప్పుకొన్న పెత్తందార్లు సినిమాలో ఆ పోస్టును కేవ‌లం ఒళ్లు కార‌ణంగా పోగొట్టుకున్నారంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. న‌డుం మ‌డ‌త‌లు ఎక్కువ‌గా ఉన్నాయంటూ.. ఆమెను హీరోయిన్‌గా మార్చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news