Moviesప్ర‌భాస్‌పై కుట్ర‌లు చేస్తోన్న ఆ స్టార్ హీరోలు ఎవ‌రు... వాళ్ల‌తో చేతులు...

ప్ర‌భాస్‌పై కుట్ర‌లు చేస్తోన్న ఆ స్టార్ హీరోలు ఎవ‌రు… వాళ్ల‌తో చేతులు క‌లిపిందెవ‌రు..!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ సూపర్ స్టార్. `బాహుబలి`, `సాహో`, `రాధేశ్యామ్` తో పాటు ప్రస్తుతం లైన్లో ఉన్న `సలార్` ప్రాజెక్ట్ కె `ఆది పురుష్‌` స్పిరిట్ లాంటి సినిమాలతో ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోలను మించిపోయిన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ టాలీవుడ్ హీరో మాత్రమే కాదు దేశం మొత్తం మెచ్చిన నేషనల్ సూపర్ స్టార్. లైన్లోలో ఉన్న ప్రభాస్ సినిమాల కోసం సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషల్లో ఉన్న సినీ అభిమానులు అందరూ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పెదనాన్న కృష్ణంరాజు మరణం ప్రభాస్ ని ఎంతగా కృంగదీసిందో చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజుకు కొడుకులు లేకపోవడంతో ప్రభాస్ అన్ని తానే అయ్యి ఆయన కార్యక్రమాలు ముందుండి నిర్వహిస్తున్నారు. ఇక కృష్ణంరాజు నట వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఏకైక స్టార్ హీరో ప్రభాస్. ప్రభాస్ కృష్ణంరాజు బాండింగ్ ఎంతో స్పెషల్. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న `ఆది పురుష్‌` వచ్చే సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా సీత పాత్రలో కృతిస‌న‌న్ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

అయితే ప్రభాస్ – కృతిస‌న‌న్ మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ బాలీవుడ్ మీడియా గత నాలుగైదు రోజులుగా కుప్పలు తిప్పలుగా వార్తలు రాసేస్తోంది. ఈ వార్తను చూసి తెలుగు మీడియా కూడా వీరిద్దరి ఎఫైర్ గురించి రకరకాల స్టోరీలు రాసేస్తుంది. వాస్తవంగా చూస్తే కృతిస‌న‌న్ ఇప్పటికే ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్ లను మెయింటైన్ చేసింది. ప్రభాస్ విషయంలో అనుష్క పేరు తప్ప మరెవరి పేరు ఎప్పుడు రాంగ్‌గా వినిపించలేదు. అయితే బాలీవుడ్ మీడియా పనికట్టుకుని ప్రభాస్, కృతి స‌న‌న్ మధ్య ఎఫైర్ ఉందన్న వార్తలు అల్లేస్తోందని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ బాలీవుడ్ బడా హీరోలు సైతం ఈర్ష‌ పడేలా ఉంది. ఇటీవల వరుసగా బాలీవుడ్ స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలు అన్నీ డిజాస్టర్లు అవుతున్నాయి. అక్కడ స్టార్ హీరోలు సినిమాలకు మినిమం గ్యారంటీ కలెక్షన్లు కూడా రావటం లేదు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ప్రభాస్ సినిమాలు సూపర్ హిట్ అయితే.. ఇక ప్రభాస్ క్రేజ్ ఆపటం ఎవరి తరం కాదు. అందుకే ప్రభాస్ ను టార్గెట్ చేసుకొని బాలీవుడ్ మీడియా లేనిపోని కథనాలు అల్లేస్తోందని ప్రభాస్ పీఆర్ టీం మండిపడుతోంది.

ప్ర‌భాస్‌ను టార్గెట్ చేసే క్ర‌మంలో కొంద‌రు బాలీవుడ్ హీరోలు ఉండ‌గా.. వారికి అక్క‌డ మీడియా వంత పాడుతోంద‌ని అంటున్నారు. కేవలం ప్రభాస్ ను టార్గెట్ చేసే కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి వార్తలు రాస్తున్నారే కానీ, ప్రభాస్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడన్న విషయాన్ని వారు మర్చి పోతున్నారని ప్రభాస్ అభిమానుల సైతం మండిపడుతున్నారు. ఏదేమైనా సౌత్ సినిమాల దండయాత్ర దెబ్బతో బాలీవుడ్ మాత్రమే కాదు నార్త్ మీడియా కూడా కుళ్లుకుంటుందని ఈ పరిణామమే చెబుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news