Moviesక‌మిట్మెంట్ గుట్టంతా బ‌య‌ట పెడుతోన్న తేజ‌స్విని... టాలీవుడ్‌లో టార్గెట్ ఎవ‌రు...!

క‌మిట్మెంట్ గుట్టంతా బ‌య‌ట పెడుతోన్న తేజ‌స్విని… టాలీవుడ్‌లో టార్గెట్ ఎవ‌రు…!

అచ్చ తెలుగు అమ్మాయి అయినా తేజస్వి మదివాడ‌ తొలిసారిగా టాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు – విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ కి మరదలుగా చిన్న రోల్‌తో ఆమె టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు తేజస్వి చాలామంది లుక్స్ లో పడటంతో ఆమెకు మంచి అవకాశాలే వచ్చాయి. ఎందుకో గాని మంచి హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నా… అటు గ్లామరసం కూడా వలకపోస్తూ ఉండడంతో ఆమెకు పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఛాన్సులు వస్తాయని అందరూ అనుకున్నారు.

అయితే తేజస్విని దురదృష్టం వెంటాడింది. ఆమెకు పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఎక్స్‌పోజింగ్‌కు పూర్తిగా గేట్లు ఎత్తేసింది. రాంగోపాల్ వర్మ ఐస్‌క్రీమ్ సినిమాలో కూడా నటించింది.
సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు చాలా హాట్ హాట్ ఫోటోలతో దర్శనమిస్తూ ఉంటుంది. కావలసినంత బోల్డ్ డైలాగులు కూడా చెబుతూ వార్త‌ల్లో ఉంటోంది. ఇక ఇటీవల బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొని బుల్లితెరపై కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ప్రస్తుతం ఆమె కమిట్మెంట్ అనే సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు వాయిదాల తర్వాత ఈ నెల 19న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో తేజస్వి పలు షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ సినిమాలో మొత్తం నాలుగు స్టోరీలు ఉంటాయని.. అందులో తనది సినిమా అవకాశాల కోసం తిరిగే అమ్మాయి పాత్ర అని.. ఈ సినిమా ట్రైలర్ చూసిన వారందరూ కూడా తమ సినిమా ఇండస్ట్రీని ఇబ్బందుల్లోకి నెడుతుందని చర్చించుకుంటున్నారని ఆమె చెప్పింది.

తమ సినిమాలో కమిట్మెంట్ అనే పాయింట్ బేస్ చేసుకుని… మెసేజ్ ఓరియెంటెడ్‌తో కథ‌ నడుస్తుందని తేజస్వి చెప్పింది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ లో గత మూడు నాలుగు సంవత్సరాలుగా పెద్ద రచ్చగా మారిన కమిట్మెంట్ అంశం గురించి… కొందరిని టార్గెట్ చేస్తూ కొన్ని సీన్లు ఉంటాయని అంటున్నారు. మరి కమిట్మెంట్ మూవీలో ఎవరిని ? టార్గెట్ చేశారో తెలియాలంటే ఈ నెల 19 వరకు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news