Moviesలైగర్ కు బిగ్ షాకిచ్చిన సెన్సార్.. ఆ సీన్స్ అన్ని కట్...

లైగర్ కు బిగ్ షాకిచ్చిన సెన్సార్.. ఆ సీన్స్ అన్ని కట్ చేస్తేనే సినిమా రిలీజ్..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి జంటగా నటిస్తున్న చిత్రం లైగర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించారు పూరి జగన్నాథ్. గత కొంతకాలంగా ఒక్క హిట్టు కూడా పడని పూరి జగన్నాధ్.. తన ఆశలన్నీ ఈ సినిమా పైన పెట్టుకొని ఉన్నారు. రౌడీ హీరో లాంటి విజయ్ దేవరకొండను కూడా వాడుకోలేకపోతే పూరీ జగన్నాథ్ డైరెక్టర్ గా ఫెయిల్ అయినట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు.

కాగా రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు భారీ షాక్ ఇచ్చారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్టు దానివల్ల సినిమా చూసిన జనాలు ఇబ్బందికరంగా ఫీల్ అవుతారని భావించి సెన్సార్ సభ్యులు మొత్తం ఏడు సీన్స్ ను డిలీట్ చేయాల్సిందిగా మూవీ మేకర్స్ ను కోరారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే సినిమా మొత్తానికి హైలైట్ గా మారేది ఆ ఏదు సీన్స్ నే.

పూరి జగన్నాథ్ లాంటి మాస్ డైరెక్టర్ తో రౌడీ హీరో కాంబో అంటే జనాలు ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు బోల్డ్ సీన్స్ బోల్డ్ డైలాగ్స్ ఖచ్చితంగా ఉండాలనుకుంటారు. మరి సినిమాకు హైలెట్ అయిన ఆ ఏడు సీన్స్ ని సెన్సార్ సభ్యులు కట్ చేయమని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మొత్తానికి.. ఆ ఏడు సీన్స్ హైలెట్. మరి ఇప్పుడు సెన్సార్ రివ్యూ ప్రకారం ఆ సీన్స్ కట్ చేస్తే సినిమా ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. దీంతో రిలీజ్ కు ముందే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు భారీ షాక్ తగిలిన్నట్లైంది. మరి చూడాలి ఇంపార్టెన్స్ సీన్స్ లేకుండా విజయ్ దేవరకొండ ఏమాత్రం హిట్టు కొడతాడో..తెలియాలంటే ఆగస్టు 25 వరకు ఆగాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news